టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రాజకీయ చాణక్యుడని తెలుగు తమ్ముళ్లు అంటుంటారు. కానీ అది ఏ మాత్రం నిజం కాదు. ఆయన చరిత్ర మొత్తం చూస్తే స్వార్థమే కనిపిస్తుంది. తాను పదవిలో ఉండడానికి ఎంతకైనా తెగించే రకం. ఇద్దరు శత్రువులతో ఒకేసారి స్నేహం చేస్తాడు. కానీ ఏమీ ఎరగనట్లు నటిస్తాడు.
ఓ వైపు టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరింది. మరో వైపు చంద్రబాబు ఎందుకైనా మంచిదని కాంగ్రెస్కు కూడా స్నేహ హస్తం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో బాబు చిత్తుగా ఓడిపోయారు. దీంతో కేసులకు భయపడి సీఎం రమేష్ను బీజేపీలోకి పంపారు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కుట్రలకు తెరతీశారు. అందులో భాగంగానే తను చెప్పినట్లు ఆడే రమేష్కు చెందిన కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ నుంచి 2023లో కాంగ్రెస్కు రూ.30 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు అందేలా చేశారు.
బాండ్లు స్వీకరించిన కాంగ్రెస్ చంద్రబాబు చెప్పినట్లు చేస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిపైకి సొంత సోదరి షర్మిలనే ఎగదోశారు. ఈ క్రమంలో ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏకంగా ఏపీ పీసీసీ చీఫ్ అయ్యారు. ఇప్పుడు బాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేరుగా జగన్ టార్గెట్గా మాట్లాడుతోంది.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు సంపాదించిన సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో ఉన్నా బాబు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్కు రూ.30 కోట్ల బాండ్లు ఇచ్చాడు. జగన్ను ఇబ్బంది పెట్టేందుకు నారా వారు తయారు చేసిన గ్యాంగ్ మొత్తాన్ని రమేష్ మేపుతున్నాడు. షర్మిల, పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిశోర్ సహా చాలామందికి ప్రత్యేక విమానాలు పంపడం.. ఇతర ఖర్చులు చూసుకోవడం అంతా ఆయన పనే.
వివేకానందరెడ్డి హత్య కేసును వైఎస్సార్సీపీపై నెట్టేందుకు జరుగుతున్న కుట్రలకు స్పాన్సర్ సీఎం రమేష్ అని విమర్శలున్నాయి. బాబు ఆదేశాలతో షర్మిల, సునీతకు పెద్ద మొత్తంలో నగదు ఇచ్చినట్లు చెబుతున్నారు. తొలుత కడప ఎంపీగా వివేకా మొదటి భార్య లేదా సునీత పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఇప్పుడు నారా వారి సూచనలతో షర్మిల బరిలో ఉంటారని తెలుస్తోంది. దీనికి కూడా రమేష్ నగదు సమకూరుస్తున్నట్లు ప్రచారం ఉంది.
బాబుకు ఏనాడూ ప్రజా ప్రయోజనాలు పట్టవు. కేవలం తను, తన కుటుంబం బాగుంటే చాలనుకుని చీకట్లో ఎన్ని ఒప్పందాలైనా చేసుకుంటాడు. కేసులకు భయపడి బీజేపీతో చేరాడు. మరోవైపు ఆ పార్టీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్తో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తదితరుల ద్వారా స్నేహపూర్వకంగా ఉంటున్నాడు. కాపుల ఓట్ల కోసం పవన్కు ప్యాకేజీ ఇచ్చాడు. షర్మిలకు డబ్బు ఇచ్చి జగన్ను తిట్టిస్తున్నాడు. సీఎం కుర్చీ కోసం ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రి ఇంకెంత దిగుజారుతాడో..