టీడీపీ జనసేన పొత్తు ప్రకటించిన నాటి నుండి అందరి ఆలోచనలు గోదావరి జిల్లాల వైపే ఉన్నాయి. తనకి బలం ఉందని పవన్ భావిస్తున్న గోదావరి జిల్లాల్లో, జనసేనకు ఎన్ని కేటాయిస్తారు, టీడీపీ సీనియర్లలో ఎంతమందికి మొండి చెయ్యి చూపిస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేల కొంచెం లేటుగా రిలీజ్ చేసిన లిస్టు చూస్తే ఇరు పార్టీలకు ఎదురు దెబ్బలు తప్పేలా లేవు .
టీడీపీ నుండి మొదటి వేటు చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి కావటంలో కీలక పాత్ర పోషించిన యనమల రామకృష్ణుడి పై పడింది. ఆనాడు ఎమ్మెల్యేల ప్రత్యక్ష హాజరు లేకుండా, కేవలం సంతకాలు పెట్టారాంటూ ఒక కాగితం చూపి ఎన్టీఆర్ ని దించి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసిన నాటి స్పీకర్ యనమల పై తొలి వేటు వేశారు చంద్రబాబు . తుని సీటు యనమల రామకృష్ణుడిని కాదని యనమల దివ్యకి కేటాయించారు.
మిగతావి నియోజక వర్గాల వారీగా చూస్తే.
తుని
తుని సీటు యనమల దివ్యకు కేటాయించడంతో యనమల కృష్ణుడులో ఆందోళన , ఇప్పటికే ఇరు వర్గాల మధ్య వైర్యం ఉన్న నేపథ్యంలో యనముల కృష్ణుడు తన అనుచర వర్గంతో భేటీ అయ్యి యనమల దివ్య ఓటమికి కృషి చేస్తాను అను బహిరంగ వాఖ్యలు చేస్తూ చంద్రబాబుని నమ్ముకుంటే నోటిలోకి మట్టి కొట్టాడు అని అసహనం వ్యక్తం చేసాడు.
పెద్దాపురం
ఇక్కడ సీట్ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్పకు ఇచ్చారు, అయితే ఇక్కడ గుర్రం చంద్ర మౌళితో యువగలం, బాదుడే బాదుడే కార్యక్రమాలు చేపించి సీట్ ఇస్తాం అనే హామీతో విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టించి చివరికి మొండి చేయి చూపాడు. అలాగే జనసేన నుంచి రామస్వామి బాబు పోటీ చేస్తాడు భారీ మెజారిటీ తో గెలుస్తాడు అంటూ పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్ డబ్బు ఖర్చు పెట్టించి ఈ రోజు పొత్తులో భాగంగా సీట్ వదులుకున్నారు.
అనపర్తి
నలిమిల్లి రామకృష్ణ రెడ్డికి టికెట్ ప్రకటించారు, ఇతని మీద ఉన్న అవినీతి ఆరోపణలతో క్యాడర్ సహకరించే పరిస్థితి లేదు . ఇక్కడ జనసేన ఉన్న లేనట్లే .
ముమ్మడివరం
దాట్ల సుబ్బరాజుకు టికెట్ కేటాయించారు ఇక్కడ, అయితే ఇక్కడ పితాని బాలకృష్ణకు జనసేన టికెట్ ఇస్తాం అని పార్టీలోకి తెచ్చుకున్నారు . పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో పోటీకి రెడీగా ఉండమని చెప్పి, గ్రౌండ్ అంత ప్రిపేర్ చేసుకున్న బాలకృష్ణకు ఇది షాక్. ఇప్పుడు పితాని బాలకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
పి .గన్నవరం
మహాసేన సరిపెల్లి రాజేష్ కి ఇక్కడ సీట్ కేటాయించారు. జనసేన సమన్వయకర్తగా ఉన్న గిడ్డి సత్యనారాయణ అలాగే మద్ద చంటిబాబు టికెట్ రేసులో ఉన్నారు . ఇప్పటిదాకా టీడీపీ ఇంచార్జిగా ఉన్న నమన రాంబాబు యువగలం పాదయాత్రకు టికెట్ ఇస్తాం అని హామీతో బాగా ఖర్చు పెట్టించి అసలు టికెట్ రేస్ లో లేని రాజేష్ కు టికెట్ ఇవ్వడంతో అయోమయంలో రాంబాబు వర్గం.
కొత్తపేట
బండారి సత్యనందరావుకు టీడీపీ నుంచి టికెట్ ఇచ్చారు. ఇక్కడ జనసేన నుంచి సోదరుడు వరసైన బండారు శ్రీనివాస్ అభ్యర్థి రేసులో ఉన్నారు . శ్రీనివాస్ ఎంత వరకు టీడీపీకి సహకరిస్తారో చూడాలి
మండపేట
సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావు టికెట్ ఇచ్చారు. ఇప్పటికే మూడు సార్లు గెలిచినా జోగేశ్వర్ రావు మీద తీవ్ర వ్యతిరేకత వుంది. ఇప్పటికే టికెట్ ఇవ్వకూడదు అని టీడీపీ కార్యకర్తలు గొడవలు చేసారు . ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాలు గెలిచి వైస్సార్సీపీ స్ట్రాంగ్ గా ఉంది. టీడీపీ పార్టీ పెట్టిన తరవాత మండపేట మున్సిపాలిటీని కోల్పోవడం ఇదే మొదటసారి అలాగే జనసేన ఇంచార్జి వేగుళ్ల లీలా కృష్ణ జోగేశ్వరావు పోటీ విషయంలో మాటలు తూటాలు పేలుస్తున్నా తరుణంలో జోగేశ్వరావుకు ఏ మాత్రం సహకరిస్తాడో చూడాలి.
రాజమండ్రి సిటీ
సిట్టింగ్ ఎమ్మెల్యే భవానినీ కాదని భర్త ఆదిరెడ్డి వాసుకు టికెట్ ఇచ్చారు. బుచ్చయ్య చౌదరి సహకరించే పరిస్థితి లేదు. ఆదిరెడ్డి వాసు కార్యకర్తలకు అందుబాటులో ఉండడు, ప్రజల్లో సదాభిప్రాయం లేదు .
జగ్గంపేట
ఇక్కడ జ్యోతల నెహ్రూకు సీట్ కేటాయించారు. జనసేన ఇంచార్జ్ సూర్య చంద్రతో విభేదాలు ఉన్నాయి. ఈ మధ్యనే జరిగిన టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశంలో జ్యోతల నెహ్రూ, సూర్య చంద్ర తన్నుకున్నారు. ప్రస్తుతం టీడీపీ జనసేన రెండు వర్గాలుగా విడిపోయాయి.
ఇన్ని వివాదాల మద్య వీళ్ళు ఏ మాత్రం సఖ్యతతో పోటీ చేస్తారు అనేది ఆసక్తికరం .