అధికారంలోకి వస్తే విద్యాదేవెన, వసతి దీవెన రద్దు చేస్తాం అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి, ప్రైవేట్ విద్యా యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చాలని వేసిన ప్రణాళికలో మరో మోసం కలలకు రెక్కలు. ఎవరైనా అధికారంలోకి రావడానికి వరాలు ఇస్తారు, అదేంటో టీడీపీ మాత్రం శాపాలను ఇస్తూ వాటిని వరాలుగా చిత్రీకరిస్తుంది..
కలలకు రెక్కలు అంటూ ప్రొఫెషనల్ కోర్సులు చదవడానికి బ్యాంక్ నుండి వడ్డీ లేని రుణాన్ని ఇప్పిస్తాం అని ఓ పథకం తాలూకా వివరాలను వారి వెబ్సైట్ లో పెట్టి, ఆసక్తి ఉన్నవారిని అప్లయ్ చేసుకోమన్నాం, అందులో ఇప్పటికే 20,000 అప్లికేషన్స్ వచ్చాయి అని టీడీపీ చెప్పుకుంటోంది. ఆ కోర్సులు ఏమిటా అని తెరిచి చూస్తే కుకింగ్, ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా మ్యానేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ లు మినహా మిగిలిన అన్ని కోర్సులు ITI లో కవర్ అయ్యేవే ఉన్నాయి. రాష్ట్రం లో ఇప్పటికే ITI కోర్సులు చేసేవారికి విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్సుమెంట్ జరుగుతుంది, అంటే వారు చెప్పే కోర్సులు దాదాపుగా అన్నీ ఇప్పుడు ఉచితంగానే విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. కానీ అవే కోర్సులను ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించి అవి చదవడానికి అయ్యే ఖర్చును బ్యాంక్ లోన్ ఇప్పిస్తారట, వడ్డీ లేకుండా అసలు మాత్రం కట్టుకోవాలట. ఇదెక్కడి చోద్యం ఉచితంగా వస్తున్న వాటిని డబ్బు ఖర్చు చేసి చదువుకోవాలని మేనిఫెస్టో లో పెట్టడం ఏమిటో దానికి కలలకు రెక్కలు అని ట్యాగ్ లైన్ పెట్టడం ఏమిటో, కేవలం విద్యను ప్రైవేటుపరం చేసి, ప్రభుత్వ విద్యను నాశనం చేయడమే టీడీపీ అంతిమ లక్ష్యం….
ఇక అన్ని కలిపి వంద కూడా లేని కోర్సులు, అది కూడా డబ్బు కట్టి చదువుకోవాల్సిన పథకానికే కలలకు రెక్కలు అయితే, ఈ మధ్యే ఎడెక్స్ తో ఒప్పందం కుదుర్చుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అందుబాటులే ఉండే అత్యంత ఖరీదైన దాదాపు 2000 రకాల ప్రొఫెషనల్ కోర్సులను ఉచితంగానే ఆన్లైన్ లో అందించడానికి సిద్ధం గా ఉన్న ఈ జగన్ ప్రభుత్వ విధానాన్ని ఎంత గొప్పగా ప్రచారం చేసుకోవాలి . విద్య ప్రభుత్వ భాద్యత కాదు అన్న చంద్రబాబుకి ఇలాంటి ఉన్నత ఆలోచనలు వచ్చే జన్మలో కూడా రావేమో.