తెలుగుదేశం పార్టీ వరుసగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన పనులు చేసుకుంటూ పోతుంది. ఈసారి గెలవకపోతే మళ్ళీ తన జన్మలో అధికారాన్ని అందుకోలేనని నిర్ణయించుకున్న బాబు కూడా ఈ చర్యలను ఆపించకుండా వేడుక చూస్తున్నారు. తీవ్ర అసంతృప్తితో, గత అయిదేళ్ళుగా అధికారానికి దూరమయి మొహం వాచిపోయి ఉన్న టీడీపీ అనుచరులు కూడా అధికారాన్ని ఎలా అయినా చేజిక్కించుకోవాలనే ఆశతో తప్పుడు దారుల్లో తెగబడుతున్నారు.
మొన్నటి వరకూ అనుమతులు తీసుకోకుండా సభలు నిర్వహించి, అభ్యంతరం తెలిపిన అధికారులపై దాడులు చేసినందుకు గాను ఎన్నికల కమిషన్ టీడీపీపై కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆపై సీయం వైయస్ జగన్ పై సోషల్ మీడియాలో ట్రోల్ చేసినందుకు ఈసీ నుంచి హెచ్చరికలు కూడా అందుకుంది. అయినా తెలుగుదేశం ఆ తర్వాత కూడా పంథాను. వీడలేదు. వరుసగా పార్టీ నాయకులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి పేట్రేగిపోతున్నారు.
ఇకపార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ వారిది మరొక ఉల్లంఘన జరిగింది. కురుపాం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. ఆమె భర్త సన్యాసినాయుడు ప్రభుత్వ ఉద్యోగి. దీంతో ఆయన నివాసముంటున్న ప్రభుత్వ కార్టర్స్లో ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి చేరికలు జరిగాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ క్వార్టర్స్లో జాయినింగ్స్ నిర్వహించడం ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం చేరికలకు సంబంధించిన ఫోటోలను పరిశీలించినట్లు తెలుస్తోంది. అనంతరం తోయక జగదీశ్వరిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
అంతే కాక, సాక్షాత్తూ చంద్రబాబు సతీమణి నిజం గెలవాలి పేరుతో యాత్ర చేస్తున్న నారా భువనేశ్వరి కూడా మూడు లక్షల రూపాయలను పంచి బెడుతున్నట్టు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చిన ఘటనపై కూడా ఎన్నికల కమీషన్ దర్యాప్తు చేయనుంది. ఇలా ఎక్కడికక్కడ తెగబడుతున్న టీడీపీ వారి మీద ఎప్పటికప్పుడు వస్తున్న కంప్లయింట్లను ఎన్నికల కమీషన్ పరిశీలిస్తోంది.