రాష్ట్రం లో మహిళల మీద టీడీపీ నాయకుల దాడులు రోజు రోజు కీ శృతి మించితున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట లో ఒంటరి మహిళను వేధించిన ఘటనలో టీడీపీ సీనియర్ నాయకుడు పెంచలయ్య ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే రాజంపేట సిఐ మద్దయ్య అచారి తెలిపిన సమాచారం మేరకు శ్రీ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ( మోదుగుల కళావతమ్మ ఇంజినీరింగ్ కళాశాల) అధినేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోదుగుల పెంచలయ్య ఉస్మన్ నగర్ లో నివాసం వుంటున్న ఒంటరి మహిళను వేధించటం మొదలు పెట్టారు. బుదవారం నాడు రాత్రి పూట అ ఒంటరి మహిళ ఇంటికి వెళ్ళి తన కోరిక తీర్చాలని బలవంతం చెయ్యగా అ మహిళ టీడీపీ నాయకుడు పెంచలయ్య కోరిక ను తిరస్కరించి తను తన ఇంట్లో వుండగానే బయటపడి పెంచలయ్య ను ఇంట్లో వుంచి ఘడియ పెట్టీ పోలీసులకు సమాచారం అందించారు.
ఫోన్ లో పిర్యాదు అందుకున్న రాజంపేట పోలీసులు వెంటనే స్పందించి అ ఒంటరి మహిళ ఇంటికి చేరుకొని పెంచలయ్య ను అదుపులోకి తీసుకున్నరు.దీని మీద రాజంపేట సిఐ మద్దయ్య అచారి మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులు దిశ యాక్ట్ ద్వారా మహిళ ల పిర్యాదులు మీద వెంటనే స్పందించి చర్యలను తీసుకుంటున్నాము .అలాగే ఒంటరి మహిళ నుంచి పిర్యాదు రాగానే తక్షణం స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాము విచారణ చేస్తున్నాము అని తెలిపారు.