శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి దెబ్బకు టీడీపీకి రోజు రోజు కీ ఎదురుదెబ్బలు తగులుతూనే వున్నాయి.ఇప్పటికే కీలక ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీకి దూరం జరిగారు. ప్రస్తుతం సుధీర్ రెడ్డి దెబ్బకు తట్టుకోలేక శ్రీకాళహస్తికి చెందిన తిరుపతి టీడీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేవలం బొజ్జల సుధీర్ రెడ్డి నియంతలా ప్రవర్తిస్తూ నన్ను వెంటబడి మానసికంగా హింసించాడు. అతడిని హింసను తట్టుకోలేక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు , లోకేష్ తో పాటు పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చంనాయుడు అందరికి ఫిర్యాదు చేశాను. కానీ అందరూ కూడా సుధీర్ తో కలిసి పని చెయ్యాలని కొన్నింటిని చూసి చూడనట్టు వదిలెయ్యమని చెప్పారని తెలిపారు. అప్పటికి పార్టీ పెద్దల సూచన మేరకు కలిసి పని చేసేందుకు ప్రయత్నం చేశాను కానీ నన్ను తన మాటలతో , చేష్టలతో మానసికంగా వేధించాడు. దీనితో ఇక టీడీపీ పార్టీలో కొనసాగలేక పార్టీకి రాజీనామా చేస్తున్న అంటూ ప్రకటించారు. తనకు అత్యంత ఇష్టమైన చంద్రబాబు, లోకేష్ , అచ్చం నాయుడు అందరూ క్షమించాలి అంటూ కోరారు.
ఇప్పటికే సుధీర్ దెబ్బకు కూటమి పార్టీలు ఎలక్షన్లో సహకరించే పరిస్థితులు లేవు. నేను తలుచుకుంటే జనసేన పార్టీ శ్రీకాళహస్తిలో వుండదు అంటూ మాట్లాడి జనసేన నియోజకవర్గ ఇన్చార్జి వినితాతో గొడవకు దిగారు. దానిపై జనసేన నాయకులు కార్యకర్తలు ప్రచారానికి దూరంగా వున్నారు. మరో వైపు బిజెపి నాయకులు కోల ఆనంద్, ఇతర పార్టీ పెద్దలను తన దురుసు ప్రవర్తనతో ఒంటెద్దు పోకడలతో ప్రచారానికి పిలవకుండా అసలు శ్రీకాళహస్తిలో బిజెపికి బలం లేదు అంటూ చులకనగా మాట్లాడుతు వుండే సరికి ఈ ఎలక్షన్ లో శ్రీకాళహస్తిలో టీడీపీకి బిజెపి దెబ్బ రుచి చూపిస్తామని కారాలు మిరియాలు నూరుతున్నారు.
బొజ్జల సుధీర్ ఇప్పటికైనా అందరినీ కలుపుకుపోకపోతే ఇటూ శ్రీకాళహస్తిలో తను ఓటమి చెందడంతో పాటు తిరుపతి బిజెపి ఎంపీ ఓటమికి కూడా పరోక్ష కారణం అవుతున్నాడు అని జిల్లా బిజెపి నాయకులు ఆందోళన పడుతున్నారు.