పొత్తుల ప్రక్రియ చివరి దశకి చేరుకున్న తరుణంలో టిడిపి జనసేన కూటమి తమ అభ్యర్థులను 14వ తేదీ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. మొదటి జాబితాను ఇదివరకే టిడిపి జనసేనలు ప్రకటించాయి. మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులతో టిడిపి తమ వారిని ప్రకటించగా, జనసేన 5 మంది అభ్యర్థులను ప్రకటించింది.
నిన్న ప్రకటించినటువంటి పొత్తుల్లో భాగంగా 175 అసెంబ్లీ స్థానాలలో టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తానని ప్రకటించగా ఇప్పటికే 94 మందిని ప్రకటించింది మిగిలిన 50 మంది అభ్యర్థులను 14వ తేదీ ప్రకటిస్తారని చంద్రబాబు తెలిపాడు. జనసేన పార్టీ విషయం కొస్తే మొదట 24 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన , తర్వాత బిజెపితో పొత్తు కన్ఫర్మ్ అవ్వడంతో ఇప్పుడు 21 సీట్లలో పోటీ చేస్తామని తెలిపారు. ఐదు సీట్లు అన్ని ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన 16 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జనసేన లతో కూటమిలో ఉన్న బిజెపి 10 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తామని మీడియాతో తెలపగా ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే సమాచారం తెలియాల్సి ఉంది.
పార్లమెంటు స్థానాలు విషయానికొస్తే టిడిపి 17 జనసేన 2 బిజెపి 6 స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. టిడిపి 17 స్థానాలలో 12 పార్లమెంట్ స్థానాలకు తమ అభ్యర్థులని 14వ తేదీ ఖరారు చేస్తుందని సమాచారం. జనసేనకి సంబంధించి రెండు పార్లమెంట్ స్థానాలలో ఎక్కడ పోటీ చేస్తారన్న సమాచారం లేదు. జనసేన పోటీ చేయదలిస్తే మచిలీపట్నం నుంచి సెట్టింగ్ ఎంపీ బాల సౌరినీ బరిలోకి దింపే అవకాశం ఉంది , ఇహ కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తాడని వార్తలు వెలువడుతున్నాయి. బీజెపీ తమ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారో సరైన సమాచారం లేదు