2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి మేనిఫెస్టోపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కూటమి మేనిఫెస్టో విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు, కానీ మూడు గంటల సమయం కావస్తున్నా వేదికపైకి ఎవరు రాకపోయేసరికి జర్నలిస్టులు విస్తుపోయారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతారని ప్రకటించారు. కానీ మూడు గంటలు అవుతున్నా ఇప్పటివరకు మేనిఫెస్టోకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. అసలు ఈరోజు చేస్తారా లేదా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో అమలుకు నోచుకోని హామీలు తెలుగుదేశం ప్రకటించింది అంటూ అధికార పక్షం సర్వత్ర విమర్శలు చేస్తోంది.
రెండు రోజులు క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నవరత్నాలు ప్లస్ పేరిట ఆ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసింది. మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత సీఎం జగన్ ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సూపర్ సిక్స్ ని ప్రకటించినప్పటికీ జనసేన , బిజెపిలో సంబంధించిన ఎటువంటి హామీలు అందులో పొందుపరచలేదు. కూటమిలో ఉన్న మూడు పార్టీలు కలిపి ఒక మేనిఫెస్టోని సిద్ధం చేయాలని ఒక కమిటీనీ వేశారు కానీ మేనిఫెస్టోలో ఏ పథకాలు పొందిపరిచారో సరైన సమాచారం లేదు. మేనిఫెస్టో ప్రకటన ఈరోజు ఉంటుందో లేదో చూడాలి. ప్రెస్ మీట్ సమయం దాటి మూడు గంటలు కావోస్తున్న జర్నలిస్ట్ మిత్రులకి ఎటువంటి సమాచారం లేదు.