ఇంటర్పోల్ సమాచారం తో బ్రెజిల్ నుండి విశాఖ పోర్ట్ కు వచ్చిన 25 వేల కిలోల డ్రగ్స్ కంటైనర్ ను సీబీఐ పట్టుకుంది. దానిని దిగుమతి చేసుకుంటుంది ఎవరు అని ఆరా తీయగా సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ అనే సంస్థ అని తేలింది..
ఈ సదరు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ సీఈఓ కూనం కోటయ్య చౌదరి కాగా, అతని తండ్రి కూనం వీరభద్ర రావు ఎండీ గా వ్యవరిస్తున్నారు. వీరువురూ టీడీపీ పార్టీ సానుభూతిపరులు అని, కూనం కోటయ్య చౌదరి కి లావుకు మంచి పరిచయాలు ఉన్నాయని సోషల్ మీడియా లో ఫోటోలు వైరల్ కాగా వెంటనే భుజాలు తడుముకుని ఆగమేఘాల మీద టీడీపీ పార్టీ అఫీషల్ హ్యాండిల్ నుండి, చంద్రబాబు మరియు నారా లోకేష్ X ఖాతాల నుండి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు.. ఇక ఇదే సందని పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ ప్రభుత్వం పై నెట్టే ప్రయత్నం చేసారు. వైసీపీ ప్రభుత్వం లో డ్రగ్స్ దందా పెరిగిపోయింది అనీ, రాష్ట్రాన్ని డ్రగ్స్ కేంద్రం గా మారుస్తున్నారని భుజాలు తడుముకున్నారు..
ఈ కూనం వీరభద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాపార భాగస్వామి కాగా, బాలకృష్ణ, మరియు ఇతర టీడీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీడీపీ హయాంలో ఈ సంధ్య ఆక్వా చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు, వైసీపీ ప్రభుత్వం వచ్చాక వీరి అక్రమాలపై కొరడా ఝులిపించింది. ఈక్విడార్ దేశం నుండి రొయ్యలను దిగుమతి చేసుకుని వాటిని ప్రాసింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసేది. ఇలా చేయడం భారత ఎక్సిమ్ పాలసీకి విరుద్ధం. దీనిని గమనించిన వైసీపీ ప్రభుత్వం వీరి పై కేస్ నమోదు చేసి తనిఖీలు చేయగా కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు వ్యతిరేకంగా కూడా వీరి కార్యకలాపాలు సాగుతున్నాయని గమనించి మొత్తం 16 కేసులను నమోదు చేసి ఫ్యాక్టరీ ని మూసివేసింది..
ఈ సదరు యాజమాన్యం అంతా టీడీపీ వర్గీయులే అని స్పష్టంగా తెలుస్తున్నా ఆ నెపాన్ని వైసీపీ ప్రభుత్వం పై నెట్టాలని టీడీపీ తెగ ఆరాట పడుతుంది. పై పెచ్చు ఈ ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ పెరిగిపోయాయి అని నింద కూడా. డ్రగ్స్ పట్టుకోకుండా విడిచిపెడితే డ్రగ్స్ దందా చేసినట్లు అవుతుంది కానీ, పట్టుకుంటే ఎలా అవుతుంది. ఒకేసారి 25 వేల కిలోల డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్నారు అంటే గతంలో వారు ఇంకెంత దందా చేసి ఉంటారో, దానికి బాబు ప్రభుత్వం ఏ విధంగా సహకరించి ఉంటుందో ఎవరికి అర్థం కాని విషయమేమీ కాదు. కంపెనీ ఏమో టీడీపీ వారిది. డ్రగ్స్ పట్టుకుంది కేంద్ర ఆధీనంలో ఉన్న వైజాగ్ పోర్ట్ లో. పట్టుకుంది సీబీఐ.. స్థానిక పోలిస్ లు సిబిఐ వారికి అడ్డు తగిలారు అని ఉన్న రిపోర్ట్ లైన్ ని పట్టుకుని దాన్నే వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది అన్నట్టుగా ప్రచారం చేయడం హాస్యాస్పదం. 25 వేల కిలోల కన్సైన్మెంట్ తెచ్చుకున్న వారు కొద్ది మంది అధికారులను మ్యానేజ్ చేయలేరా? ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందో ప్రజలు గ్రహించాలి. దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు ఉంది టీడీపీ వైనం.. గతేడాది ముద్రా పోర్ట్ లో కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాదీనం చేసుకున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ అండ్ కో దృష్టిలో గుజరాత్ డ్రగ్స్ హబ్, గుజరాత్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం డ్రగ్స్ దందానీ ప్రోత్సహిస్తున్నది అని అర్థమా?
ఇదే విధంగా రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నివారించాలని వైసీపీ ప్రభుత్వం గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపి, గంజా రవాణాను అడ్డుకుని వందల టన్నుల గంజాయిని పట్టుకుని కాల్చేసిన సందర్భాలున్నాయి. గంజాయి పట్టుకుని కాల్చేయడం గంజాయి నివారణ చర్య అవుతుంది కానీ గంజాయిని ప్రోత్సహించడం ఎలా అవుతుందో టీడీపీ అండ్ కో కి తెలియాలి. వారి ఉద్దేశం లో గంజాయి రవాణాను అడ్డుకోకుండా సాఫీగా దందా జరగనిస్తే అప్పుడు గంజాయి నివారణ జరిగినట్లు.. టీడీపీ హయాంలో ఇలా గంజాయి ని అడ్డుకున్న దాఖలాలు లేవు కాబట్టి అప్పుడు రాష్ట్రం గంజాయి విముక్త రాష్ట్రం అని ప్రచారం చేసుకుంటే ప్రజలేం అర్థం చేసుకోలేని పిచ్చి వారు కాదు.. ఇక పవన్ కల్యాణ్, బాబు హాయంలో అరకు, పాడేరు లో గంజాయి వ్యతిరేక ఉద్యమం చేసిన విషయం మరిచినట్లు ఉన్నాడు.. ఈ ప్రభుత్వం చిత్త శుద్ధితో గంజాయి ని అరికట్టాలని చూస్తుంటే వారి పార్టీ లకి నిధులు సమకూర్చే వారి చీకటి దందాపై ప్రభావం పడుతుంది అని వారి బాధ…
టీడీపీ దృష్టిలో దొంగని పట్టుకున్న వారు కూడా దొంగే, పట్టుకోకుండా వదిలేయబడ్డ దొంగ ఏమో దొర అన్నట్లు… ఇలాంటి చీకటి వ్యాపారాలు చేసే ఇన్నేళ్లు పార్టీని నిలబెట్టారు. ఆఖరికి కాల్ మనీ సెక్స్ రాకెట్, వ్యభిచారం కూడా టీడీపీ హయాంలో పెద్ద వ్యాపారాలు గా ఉండేవి.