మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాటలతో తెలుగుదేశం నాయకులు గాల్లో మేడలు కట్టేస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీకేను బిహార్ డెకాయిట్ అన్న విషయాన్ని మర్చిపోయి.. అదే వ్యక్తి చేత చెప్పించిన పలుకులకు సంబరపడిపోతున్నారు. జగన్ గెలవడని, టీడీపీ గెలుపు ఖాయమని ఓ కార్యక్రమంలో ప్రశాంత్ చెప్పిన మాటలపై మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని తాత్కాలికంగా ఆనందపడిపోతున్నారు.
పీకే అంచనాలు తప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకోకుండా జగన్ పనైపోయిందని ప్రచారం చేసుకోవడం వల్ల ఒరిగేదేమీ లేదు. అసలు టీడీపీ ఎంత బలహీనంగా ఉందో క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక పొత్తుల కోసం ఆరాటపడుతున్నారు. జనసేనను కలుపుకొని 24 సీట్లే ప్రకటిచండంతో అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్పై కాపుల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక సేనాని అభిమానులైతే ఆ స్థానాలు కూడా చాలా వరకు ఎల్లో గ్యాంగ్ తీసుకుంటుందని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ తదితర చోట్ల దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్షా, జేపీ నడ్డాను నారా వారు కలిసి సుమారు నెలరోజులైనా ఇంత వరకు పొత్తుపై క్లారిటీ లేదు. దీంతో సీట్లను పూర్తిగా ప్రకటించకుండా 57 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలను ఆపాల్సి వచ్చింది. రా కదలి రా, శంఖారావం సభలు ఎక్కడ పెట్టినా అట్టర్ఫ్లాప్ అవుతున్నాయి. వాడుకుని వదిలేశారని సీనియర్లు గరంగరంగా ఉన్నారు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసి చాలామంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడో నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. వారిని యాక్టివేట్ చేసేందుకు బాబు సర్వేలు, చేరికలు, పీకే మాటలంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. సోషల్ మీడియా పెయిడ్ పేజీల్లో పోస్టులు పెట్టిస్తున్నారు. డబ్బులిచ్చి యూట్యూబ్ ఛానళ్లలో డిబేట్లు నడిపిస్తున్నారు. నారా వారి అతి తెలివితేటలను అర్థం చేసుకోలేకపోయిన అభ్యర్థులు.. ఇంకేముంది మేం గెలిచేస్తున్నామనే భావనలోకి వెళ్లిపోయారు. ఏ మంత్రి పదవి తీసుకుంటే బాగుంటుందని అనుచరగణంతో చర్చిస్తున్న మహానుభావులు కూడా ఉన్నారంట.
2009లో టీడీపీ అధినేత
మహాకూటమి కట్టి తెగ హడావుడి చేశారు. ప్రమాణ స్వీకారమే తరువాయి అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. చివరికి బొక్క బోర్లాపడిన విషయం మరిచిపోతే ఎలా.. 2014 నుంచి 19 వరకు అధికారం వెలగబెట్టి.. పసుపు కుంకుమ కింద మహిళలకు డబ్బులిచ్చేశాను.. వచ్చేది నేనేనని విర్రవీగారు. తీరా చూస్తే ఏమైంది. ఎల్లో మీడియా రాతలు, ఫేక్ సర్వేలు బూమరాంగ్ అయ్యాయి. అసలు బాబు చరిత్ర చూస్తే జన బలంతో గెలిచిందే లేదు. ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కున్నారు. తర్వాత బీజేపీ గాలిలో సీఎం అయ్యారు తప్ప ధైర్యంగా ఎన్నికల రణరంగంలోకి వెళ్లి విజయబావుటా ఎగురవేసిన సందర్భమే లేదు. మీడియా మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట కాబట్టి ఇలాంటి గాలివాటం మాటల్ని ప్రచారంలోకి తెచ్చారు. 14 ఏళ్లపాటు మంచి చేశాను. అవకాశం ఇస్తే మరోసారి చేస్తానని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో నారా వారు లేడనేది సత్యం. పీకే మాటలు పట్టుకుని ఊహాలోకంలో తేలుతూ అధికారం మాదే.. అందరి అంతు చూస్తామని కొందరు టీడీపీ నాయకులు ప్రెస్మీట్లు పెట్టి బెదిరించడం మొదలు పెట్టేశారు.
వీళ్లంతా ఒకసారి మొన్న తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన ఎవరు గెలుస్తారో చెప్పిన మాటలు కనుక్కుంటే బెటర్. దెబ్బకు మత్తంతా దిగిపోతోంది.
పీకే మాటల్లో టీడీపీ గెలుస్తుంది అన్నాడు. అలాంటప్పుడు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే సాహసం ఎందుకు చేయలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం చంద్రబాబు జనసేనతో పొత్తులో ఉన్నాడు. వీరి కూటమి గెలుస్తుందని ఆ మాజీ వ్యూహకర్త ఎక్కడా చెప్పలేదు కదా.. దీంతో ప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మేలా లేవని కొందరు జనసైనికులే అభిప్రాయపడుతున్నారు. పైగా కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. బాబు సేనను ఇంకా తక్కువ సీట్లకు పరిమితం చేసేందుకు.. మీకు బలం లేదు.. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తుంది.. అయినా కలుపుకొన్నామని చెప్పేందుకే పీకే మాటల్ని తెలుగు తమ్ముళ్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని భావిస్తున్నారు.
ఎన్నికల్లో తోక ముడిచేందుకు బాబు సిద్ధంగా ఉన్నారు. అందువల్ల టీడీపీ అభ్యర్థులూ.. నేతలూ.. ప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మి పదవుల నేమ్ప్లేట్లు కొట్టించకండి. అనవసరంగా డబ్బు వేస్ట్ తప్ప ఇంకేమి ఉండదు.