వరి సాగు చేసే రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంది. చంద్రబాబు నాయుడు తన పాలనలో మోసం చేస్తే 2019 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు అన్ని విధాలుగా ఆదుకుంటోంది. సంపూర్ణ మద్దతు ధర అందించడంతోపాటు రైతులకు గన్నీ, హమాలీ, రవాణా చార్జీల కింద టన్నుకు రూ.2,523ను అదనంగా ఇస్తోంది.
2023 – 24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 4.97 లక్షల మంది రైతుల నుంచి ఆర్బీకేల ద్వారా 29.91 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. 4.36 లక్షల మందికి రూ.5,700 కోట్ల మద్దతు ధర చెల్లించినట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మిగిలిన అన్నదాతలకు రూ.838 కోట్లను వారం రోజుల్లోగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక వచ్చే నెల నుంచి రబీ కొనుగోళ్లకు యంత్రాంగం సిద్ధమైంది. 25 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోనె సంచులు, హమాలీలు, రవాణా సదుపాయాలపై సిబ్బందికి ఇప్పటికే అవగాహన కల్పించారు.
టీడీపీ పాలనలో కేవలం 17.94 లక్షల మంది నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇక జగన్ ప్రభుత్వ హయాంలో 37.68 లక్షల మంది అన్నదాతల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. చంద్రబాబు మిల్లర్లకు దోచిపెట్టారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని మోసం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. దళారీ, మిల్లర్ల వ్యవస్థకు చెక్ పెట్టారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు అధికారులు, సిబ్బంది వెళ్లేవారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కాల్ సెంటర్ను పెట్టారు. టీడీపీ హయాంలో వరి పండించిన రైతులు అష్టకష్టాలు పడగా.. జగన్ ఆ పరిస్థితిని తప్పించారు.