వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టి పోటీ చేయాలని చూస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరోవైపు కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 2024లో అధికారం తెచ్చుకోవడమే పరమావధిగా ఆయన రాజకీయాలు, కుట్రలు సాగుతున్నాయి. అందులో భాగంగా ప్రతి పార్టీని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలికి తన బంధువు పురందేశ్వరిని నియమించేలా చక్రం తిప్పారు. కమ్యూనిస్ట్ నాయకుల్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రభుత్వాన్ని ఇష్టానుసారం తిట్టిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అయితే బాబు మాటలే వేద వాక్కు. ఆయన ఏం చెబితే అది చేస్తారు. అలాగే కాంగ్రెస్లో తన మాట వినే పెద్దలతో బాబు మాట్లాడి షర్మిల తెలంగాణ పార్టీని విలీనం చేయించి ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలు ఇప్పించారు. ప్రస్తుతం షర్మిల టీడీపీ అధినేత ఏం చెబితే అది చేస్తున్నారు. తాజాగా ఆయన పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు ఆ కాంగ్రెస్ నాయకురాలిపై ఎక్కడ లేని అభిమానం చూపించారు. షర్మిలకు ప్రాణహాని ఉందట.. ఆమెకు భద్రత పెంచాలట.. ఈ వ్యాఖ్యలు చేయడంతో షర్మిలను నడిపిస్తోంది.. స్ర్కిప్ట్లు ఇస్తోంది చంద్రబాబేనని ఇట్టే అర్థమవుతోంది. కొద్దిరోజులుగా ఆమె జగన్పై తీవ్ర స్వరంతో ఆరోపణలు చేస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ కూడా స్రా్టంగ్ కౌంటర్లు ఇస్తోంది. వాస్తవానికి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడే ఉంటానని ప్రకటించారు. అయితే వైఎస్సార్ కుటుంబాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు మాటలు విని సొంత అన్నపైనే దుష్ప్రచారానికి పూనుకున్నారు. నారా వారు కూడా కుర్చీ కోసం అందర్ని తనకు అనుకూలంగా వాడేస్తున్నారు. ఆయన మొదటి నుంచి అంతే.. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని కాంగ్రెస్తో జత కట్టగా షాక్ తగిలింది. దీంతో రాహుల్ గాంధీకి హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ, కమలం పెద్దల ఆశీస్సుల కోసం పాకులాడుతున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం అయిన తన శిష్యుడు రేవంత్రెడ్డి ద్వారా ఏఐసీసీ పెద్దలతో టచ్లో ఉన్నారు. ఏ వైపు నుంచి కూడా తనకు, తన కుమారుడు లోకేశ్కు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు ఇలా ఒకేసారి రెండు పడవల్లో ప్రయాణిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రయోగం వికటించి మొదటికే మోసం రావొచ్చేమో..