ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ గారు బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ 92 ఏళ్ల తరువాత చారిత్రాత్మకమైన కులగణన ప్రక్రియ చేపడితే వెనకబడిన వర్గాల వ్యతిరేకులుగా చలామిణి అవుతున్న కొందరు ఆ నిర్ణయాన్ని తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నరని ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు.
ఏపీలో ఒక యజ్ఞంలాగా సాగుతున్న కులగణన ప్రక్రియను బీసీలందరూ కూడా ఒక గొప్ప అవకాశంగా భావించి బలహీన వర్గాల వ్యతిరేకుల మాటలకి మోసపోకుండా తమ కులాల యొక్క వివరాలను నమోదు చేసుకోవాలని రాష్ట్రములో ఉన్న 139 బీసీ కులాలకు తాము అప్పీల్ చేస్తున్నామని మారేష్ ప్రకటించారు.
గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు ఎంతో దూర దృష్టితో కులగణన ప్రక్రియ ప్రారంభించటం చారిత్రాత్మకమైన ఘట్టమని గత ప్రభుత్వాలు బీసీల లెక్కలు తీయటానికి భయపడితే నేటి ముఖ్యమంత్రి బీసీల పక్షపాతిగా బీసీలకు రాజ్యాధికారంలో రాష్ట్ర సంపదలో వాటా ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో నేడు కుల గణన ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు.
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన తన మానస పుత్రిక లాంటి సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా పూర్తి పారదర్శకతో కులగణన ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతుందని భారతదేశం మొత్తంలో ఎక్కడా కూడా బీసీలకు జగన్ గారు ఇస్తున్నన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం మరొకటి లేదని, చివరికి బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీలకు ఇన్ని సంక్షేమ పథకాలు లేవన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించిన సంగతి తెలిసిందే.