విజయవాడ, స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ యొక్క మహా శిల్పం ఆవిష్కరణ వేడుక ఆహ్వానం సందర్భంగా సీఎం శ్రీ వైఎస్ జగన్ తమ యొక్క సందేశాన్ని విడుదల చేసారు. 81 అడుగుల ఎత్తైన వేదకపై, 125 అడుగుల ఎత్తుతో సుమారు 206 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం గత కొంతకాలంగా నిర్మాణంలో ఉంది. అన్ని ఏర్పాట్లతో సుందర నిర్మాణంతో తయారయిన ఆ విగ్రహావిష్కరణలీ ప్రజలందరూ భాగమవ్వాలని సీయం జగన్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సీఎం శ్రీ వైఎస్ జగన్ విడుదల చేసిన ఆహ్వాన ప్రకటనలో ఏమన్నారంటే,
విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న, అంబేద్కర్ గారి మహా శిల్పం.., మన రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికమనీ, ఇది, “స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’’! ఇది “సామాజిక న్యాయ’ మహా శిల్పమని, ఈ నెల 19న, చారిత్రక, స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్న ఈ విగ్రహం, దేశంలోనే కాదు…, ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ గారి విగ్రహమనీ అన్నారు.
అంబేద్కర్ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం, ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రల్ని మార్చేలా, దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి! బాధ్యతతో, ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో.., వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ప్రజారంజక ప్రభుత్వంగా వై.యస్ జగన్ పరిపాలిస్తున్నామని జగన్ ఉదహరించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా, 19వ తేదీన.., అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని, ఇప్పుడు మన విజయవాడలో, ఆవిష్కరిస్తున్న ఈ మహా శిల్పం.., మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటం మాత్రమే కాకుండా.., చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తి ఇస్తుందని, కాబట్టి అందరూ ఈ మహా వేడుకలో భాగమవ్వాలని ఆహ్వానించారు.