ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 20 అంశాలతో కుప్పంకి ప్రత్యేక మేనిఫెస్టో అంటూ టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఒక మీడియా సమావేశంలో తెలిపాడు. రాష్ట్ర ప్రజలందరికీ అమలయ్యే పథకాలకు తోడుగా ఈ 20 హామీలు కూడా అమలు పరుస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.
నారా చంద్రబాబు నాయుడు 1978లో రాజకీయ ప్రవేశం చంద్రగిరి నియోజవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచాడు. 1983 ఎన్నికల్లో చంద్రగిరిలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 1989 ఎన్నికలకి కుప్పం చేరాడు.
1989 నుంచి ఇప్పటిదాకా దాదాపు 35 సంవత్సరాలు కుప్పం శాసనసభ్యుడుగా చంద్రబాబు నాయుడు పనిచేశాడు. కానీ కుప్పం కి చంద్రబాబు చేసింది మాత్రం శూన్యం. ఈ 35 సంవత్సరాల కాలంలో 14 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు కానీ కుప్పాన్ని కనీసం మున్సిపాలిటీ కూడా చేసుకోలేకపోయాడు. 2018లో కుప్పం నియోజకవర్గాన్ని విదేశాలతో అనుసంధానం చేస్తానంటూ ఎయిర్పోర్టుకి తూతూ మంత్రంగా శంకుస్థాపన చేశాడు. మున్సిపాలిటీ కూడా చేయలేని చంద్రబాబు ఎయిర్పోర్ట్ కడతానంటే నమ్మారు అమాయక ప్రజలు. 2019 ఎన్నికల ముందు ఏదో అభివృద్ధి చేస్తాడని భావించి ప్రజలు మరోసారి చంద్రబాబుకే పట్టం కట్టారు. కానీ చంద్రబాబు గడచిన ఐదేళ్లు ఏమాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేసి తిరిగి ఎన్నికలు అనగానే 20 హామీలు అంటూ మళ్లీ మొదలుపెట్టాడు.
2019లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుప్పంని మున్సిపాలిటీ చేశాడు. కుప్పంని మున్సిపాలిటీ చేయడమే కాకుండా చంద్రబాబు అభ్యర్థన మేరకు రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక మున్సిపాలిటీ గాని ఒక రెవెన్యూ డివిజన్ గాని చేసుకోలేని అసమర్ధ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మిగిలిపోయాడు. చివరికి హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలును కూడా కుప్పం వరకు తీసుకెళ్లింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కుప్పంకే ఏమి చేయలేని చంద్రబాబు రాష్ట్రానికి చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.