సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే తప్పరు. చెప్పిందే చేస్తారని మరోసారి రుజువైంది. బడుగు, బలహీనవర్గాలు, వెనుకబడిన తరగతుల వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో ఆయన ఎప్పుడూ ముందంజలో ఉన్నారు. ఈ విషయంలో ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. శనివారం 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించగా అందులో చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చోటు దక్కింది. మహిళల కోటా కూడా పెంచారు.
– ఎంపీ సీట్ల విషయానికొస్తే నాలుగు సీట్లు ఎస్సీలకు, ఒకటి ఎస్టీకి, 11 బీసీలకు కేటాయించారు. మహిళా కోటాలో గతంలో నాలుగు ఇవ్వగా ఈసారి ఐదుగురికి అవకాశం కల్పించారు.
– ఎంపీ, అసెంబ్లీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో కంటే ఈసారి 11 స్థానాలు అదనంగా ఇచ్చారు.
– ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59 సీట్లు కేటాయించారు.
– ఎంపీ, ఎమ్మెల్యే కలిపి 2019లో మహిళలకు 19 సీట్లు ఇవ్వగా ఈసారి మరో ఐదు పెంచారు.
జనరల్ స్థానాల్లో కూడా వెనుకబడిన వర్గాలకు అవకాశం ఇచ్చిన ఏకైక వ్యక్తి జగన్. ఉదాహరణకు నెల్లూరు సిటీని ముస్లిం అయిన ఖలీల్ అహ్మద్కు ఇచ్చారు. గతంలో చాలామంది సామాజిక న్యాయం పేరుతో మోసం చేశారు. కానీ వైఎస్సార్సీపీ ఏనాడూ అలా చేయలేదు. వారికి అవకాశాలు దక్కేలా చూసింది. స్థానిక సంస్థల్లోనూ ఈ ఒరవడి కొనసాగింది. అలాగే మహిళల విషయంలోనూ వెనుకంజ చేయలేదు. చాలాచోట్ల వారికి పదవులు కట్టబెట్టింది.