వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావ సిద్ధం సభలకు అటు నాయకులు, కార్యకర్తల్లో.. ఇటు సాధారణ ప్రజల్లో క్రేజ్ మామూలుగా లేదు. ఎవరూ రావడంలేదని ఎల్లో మీడియా అబద్ధాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వాటికి వెల్లువలా తరలి వెళ్తున్నారు. తొలి సభను భీమిలి నియోజకవర్గం సంగివలసలో, రెండో సభను దెందులూరు నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించారు. ఈనెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడులో రాయలసీమ స్థాయిలో మూడో సభను జరిపేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
వాస్తవానికి సభను 11వ తేదీన నిర్వహిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. అయితే అనివార్య కారణాలతో 18కి వాయిదా వేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈసారి కూడా భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని మంత్రి, ఇంకా సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తదితర ముఖ్య నేతలు పరిశీలించారు.