బస్సు యాత్ర మంగళగిరి పట్టణ పరిధిలోని కొత్త బస్టాండ్ నుంచి మిద్దె సెంటర్ వరకు సాగింది. ఆయా ప్రాంతాలు జనసందోహంతో కిక్కిరిశాయి. సభ వద్ద బాబూ జగ్జీవన్రామ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ టీడీపీ స్థాపించిన నాటి నుంచి మంగళగిరిలో ఏనాడూ బలంగా లేదన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చిరంజీవి గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గెలిచినట్టేనన్నారు. లోకేశ్ను మరోసారి మడత పెట్టేయడం ఖాయమన్నారు. చిరంజీవిపై బీసీ పెట్టే దమ్ము చంద్రబాబుకు లేదని, కొడుక్కే సీటు ఇస్తాడన్నారు. రాష్ట్ర సాంఘి సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ దేశంలో మొదటిసారిగా సామాజిక విప్లవానికి తెరతీసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. అణగారిన వర్గాలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడున్నాడని విమర్శించారు. లోకేశ్ పాదయాత్రలో ఎర్రబుక్కు చూపించడం తప్ప ఇంకేమి చేయలేదన్నారు. నారా లోకేశ్ను తరిమికొడదాం.. లోకల్ అయిన చిరంజీవిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ పచ్చమీడియా చెప్పే మాటలు నమ్మొద్దన్నారు. ప్రతి అడుగు పేదల కోసం వేసే జగనన్నను మరోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు.
జన స్పందన
సభకు జనం నుంచి స్పందన బాగా వచ్చింది. లోకేశ్ స్థానికుడు కాదు. హైదరాబాద్లో ఉంటాడు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త అయిన చిరంజీవి స్థానికుడు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాడు. ఇది కలిసొచ్చే అంశం. అందువల్లే నాయకులు కూడా స్థానికుడు కావాలో.. హైదరాబాద్లో ఉండే టీడీపీ అభ్యర్థి కావాలో తెల్చుకోవాలని చెప్పగా ప్రజలు ఏ మాత్రం తడబాటు లేకుండా అభిప్రాయాన్ని తెలిపారు. చిరంజీవినే తమకు కావాలని, టూరిస్ట్ వద్దని స్పష్టం చేశారు. బస్సు యాత్రను చూశాక.. ఈసారైనా ఎమ్మెల్యే కావాలని ఉవ్విళూరుతున్న లోకేశ్కు వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదని తెలుగుదేశం శ్రేణులే చెబుతుండటం విశేషం.
– వీకే..