ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లోరోజురోజుకీ ప్రచారాలతో రాజకీయ పార్టీలు మునిగి తేలుతున్నాయి. మేమంతా సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు నుంచి తన రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు కూడా తన రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని ప్రజాగళం పేరుతో మొదలు పెట్టారు.
జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో నిర్వహించే ఎన్నికల ప్రచారం ఇడుపులపాయలో మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలో ముగించనున్నారు. 21 రోజులు పాటు సాగే ఈ బస్సు యాత్రలో సిద్ధం సభలు జరగని 21 పార్లమెంట్ వర్గాల్లో ని ప్రజలకు మమేకమై 21 రోజులపాటు బహిరంగ సభలు నిర్వహించునున్నారు. ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయకు వెళ్లి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తీసుకొని మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించాడు. మొదటి రోజు పులివెందుల నియోజవర్గం వేంపల్లి మండలం మీదుగా ప్రొద్దుటూరు నియోజవర్గం చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ తర్వాత ప్రొద్దుటూరు నుంచి ఆళ్లగడ్డ చేరుకొని రాత్రి ఆళ్లగడ్డలో బస్సు చేస్తారు, తిరిగి రేపు ఉదయం ఆళ్లగడ్డ నుంచి తన ప్రచారం లో మొదలుపెడతారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తన ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు నుంచి ప్రారంభించారు. గత నాలుగు రోజులుగా తాను పోటీ చేసే కుప్పం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటింటికి తిరిగి చెమటోడుస్తూ ప్రచారం చేస్తూ కుప్పం నియోజవర్గంలోనే ఉన్న చంద్రబాబు, ఈరోజు నుంచీ ప్రజాగళం యాత్రను చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నుంచి మొదలు పెట్టారు. ప్రతిరోజు నాలుగు నియోజకవర్గాలు పర్యటించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.