అరకు పార్లమెంట్ మొదటి నుండి వైఎస్ఆర్సీపీ కి కంచుకోటగా వుంది. ట్రైబల్స్ కు వైఎస్ఆర్ తరువాత జగన్ చేసిన మంచితో వారంతా మొదటి నుండి వైఎస్ఆర్సీపీ, జగన్ వెంట నడిచారు. అలాంటి సీటులో టీడీపీ చాలా గ్రౌండ్ వర్క్ చేసి కష్టపడాలి, కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టీడీపీ, చంద్రబాబు నాయుడు అరకు పార్లమెంట్ సీటు ను ఎలక్షన్ కంటే ముందుగానే ఓటమిని ఒప్పుకోని పట్టించుకోవడం లేదనిపిస్తుంది. అరకు పార్లమెంట్ లో ఏ నియోజకవర్గం చూసిన టీడీపీ కి, కూటమి అభ్యర్థులకు రెబల్ బెడద వున్నాయి. దీటైన పోటి ఇచ్చే పరిస్థితులు లేని సందర్భంలో రెబల్స్ పోటిలో వుండడంతో వైఎస్ఆర్సీపీ విజయం నల్లేరు మీద నడకే అనుకోవచ్చు.
అరకు పార్లమెంట్ లో పాలకొండ నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ కూటమి తరుపున జనసేన పోటి లో వుంది. మొన్నటి వరకు టీడీపీ ఇంచార్జీ అయిన నిమ్మక జయకృష్ణను జనసేన లోకి తీసుకొని టికెట్ కేటాయించారు. దీంతో జనసేన నాయకురాలు పడాల భూదేవి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ నమ్మించి మోసం చేశారు అని అమె కన్నీరు పెట్టీ జనసేన ఓటమే లక్ష్యంగా పనిచేస్తాను అని తెలిపారు.వీరికి అటు టీడీపీ నుండి ఇటు జనసేన నుండి మెజారిటీ మద్దతు లభించడం విశేషం. కురుపాం నియోజవర్గం చూసుకుంటే టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయింది. టీడీపీ అభ్యర్థి జగదీశ్వరీ ఒకవైపు మిగిలిన టికెట్ ఆశించిన ఐదుగురు నేతలు మరో గ్రూప్ గా జతకట్టారు. పార్వతీపురం లో టీడీపీ కొత్త అభ్యర్థి విజయ్ బోనేల కు టికెట్ ఇచ్చారు . ఇక్కడ మొదటిసారి పోటి చెయ్యడం అదే టైంలో పాత నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు ఆధ్వర్యంలో మరో గ్రూప్ గా జతకట్టారు.
ఇక మరో నియోజవర్గం సాలూరు లో టీడీపీ తరుపున సంధ్యారాణి పోటి చేస్తున్నరు, ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసిన గెలుపు దక్కలేదు. మాజీ ఎమ్మేల్యే భంజ్దేవ్, టీడీపీ అభ్యర్ధి సంధ్యారాణిల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనేలా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యమైన మరో నియోజకవర్గం అరకులో కూటమి తరుపున బిజెపికి టికెట్ కేటాయించి రాజారావును అభ్యర్థిగా ప్రకటించారు. అయితే చంద్రబాబు నాయుడు గతంలో దొన్ను దొరకు టికెట్ ప్రకటించి ఖర్చు పెట్టించారు. ఇప్పుడు తీరా ఎలక్షన్ వచ్చే సరికి బిజెపికి టికెట్ ఇవ్వడంతో దొన్ను దొర స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేస్తున్నానని ప్రకటించారు.నియోజకవర్గంలో దాదాపు టీడీపీ జీరో కి వచ్చినట్టే.
మరో కీలక నియోజకవర్గం పాడేరులో టీడీపీ పరిస్థితి రోజురోజుకీ అధమ స్థితికి చేరుకుంటుంది. ఇక్కడ టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో గిడ్డి ఈశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఈమె కు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతు ఇచ్చి టీడీపీకి వరుసగా రాజీనామాలు చేస్తూ భారీ షాక్ ఇస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఈసారి టీడీపీ కొత్త అభ్యర్థిని ప్రకటించారు. అక్కడ పాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయిన రాజేశ్వరీ టికెట్ దక్కకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చంద్రబాబు ఐదు సంవత్సరాలు పార్టీకి ఖర్చు పెట్టించి దారుణంగా మోసం చేశారు అని టీడీపీకి సహకరించే ప్రసక్తే లేదు అని తెలిపారు.
ఇలా అరకు పార్లమెంట్ లో టీడీపీ పరిస్థితీ రెండు గ్రూపులు, మూడు ముఠాలుగా చీలిపోయి ఎవరికి వారు కొట్టుకుంటున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించి గొడవలు లేకుండా చూసుకున్నారు అంతే కాకుండా జగన్ సంక్షేమ పథకాలను అభివృద్ది పనులను ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్తూ మెజారిటీ లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ వాళ్లు ఓటమిని ముందే అంగీకరించినట్టు ఉంది వారి ఎలెక్షన్ ప్రచారం సన్నద్ధత చూస్తే.