సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం అంటూ ఈనాడు రాతలు…
సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి జగన్ సింపతీ కోసమే చేయించుకున్నాడని ఎంతో ఖర్చు చేసి పేపర్ ప్రింట్ చేసి మరీ జనాలకు ఉచితంగా పంచుతున్న ఈనాడు పొందే లాభం కేవలం జగన్ పై విషం చిమ్మడమే. దానిలో భాగంగా పుంకానుపుంకాలుగా జగన్ పై దాడిగురించి వ్యతిరేక వార్తలు రాస్తున్న రామోజీ నుండి వచ్చిన మరో అద్భుతం ఈ వార్త.. రాజకీయ నాయకులపై హత్యాయత్నాలు ఎప్పుడు జరగనట్లుగా చరిత్రే మరచి రాయాలా రామోజీ !?
గతంలో చూస్తే వివిధ దేశాల ఆధినేతలను చంపారు. అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ మీద రామోజీ లాంటి కార్పొరేట్ శక్తులు కక్షగట్టి నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపాయి. అమెరికా భద్రతా దళాలు ఏమైనా చేతకానివా?
మన దేశంలో ప్రధాని గా ఉన్న ఇందిరా గాంధీని తన సొంత సెక్యూరిటీ గార్డ్స్ చంపారు. మాజీ ప్రధాని, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న మళ్లీ కాబోయే ప్రధాని అని భావిస్తున్న రాజీవ్ గాంధీని తమిళ టైగర్లు చంపారు.
ఇక మీ ఆట బొమ్మ బాబును అలిపిరి లో బాబు క్రింద క్లేమోర్ మైన్స్ పెట్ట్టారు నక్సల్స్. బాబు సీఎం గా ఉన్నప్పుడు టీడీపీ హోమ్ మంత్రి మాధవ్ రెడ్డి ని, కాంగ్రెస్ MP మాగుంట సుబ్బరామిరెడ్డి లను చంపారు.
రాజకీయాల్లో ప్రత్యర్థిని హతమార్చడానికి ఎప్పటికప్పుడు బాబు లాంటి ప్రత్యర్థులు కొత్త ఎత్తుగడతో సిద్దంగానే ఉంటారు. కొన్ని సార్లు ఎంత సెక్యూరిటీ ఉన్నా అవి ఛేదించగలరు.అదృష్టవశాత్తు జగన్ తప్పించుకోగలిగాడు. అదే అదృష్టం లేకపోవడం తో వంగవీటి లాంటి వారు పాపం బలైపోతారు.. నీకు తెలియంది ఏముంది రామోజీ? నీ చేతుల నిండా రక్తమే కదా..