ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, ఆమె సోదరి సునీతపై ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ శత్రువుల చేతుల్లో వారిద్దరూ కీలుబొమ్మల్లా మారారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా వైఎస్సార్ జిల్లా పులివెందుల మహిళా కౌన్సిలర్లు వారి తీరుపై మండిపడ్డారు. షర్మిల, సునీత చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.• హంతుకులంటూ విమర్శలు చేయడమే వారు పనిగా పెట్టుకున్నారు. ఇది దారుణం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే కారకులైన వారిని శిక్షించడానికి కోర్టులున్నాయి.• ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి హత్య చేశాడని అంటున్నారు.. మీరు చూశారా.. అవినాష్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాపాడాడని చెప్పారు. ముందు ఎంపీ, సీఎంలపై అపనిందలు మోపడం మానుకోండి.
కాంగ్రెస్ గెలిస్తే పులివెందులకు ఏం చేస్తారో షర్మిల, సునీత చెప్పడం లేదు.• షర్మిల ఒక్కరే కాదు. మేము కూడా మహానేత రాజశేఖరరెడ్డికి కూతుర్లం లాంటి వారమే. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం జగనన్న చేస్తున్న అభివృద్ధిని చూసి మాట్లాడండి. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించి ఆదుకున్నారు.• రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పథకాలు అమలవుతుంటే మీకు కనిపించడం లేదా? షర్మిల తన లబ్ధి కోసం వైఎస్సార్ కూతురినని తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి పార్టీ పెట్టారు. ఎవరు చెబితే అక్కడ మూసేసి ఇక్కడికి వచ్చారు. అక్కచెల్లెళ్ల మాటలను ఇక్కడ ఎవరూ నమ్మరు. నీచపు రాజకీయాలు చేయొచ్చు. 2024 ఎన్నికల్లో ప్రజలే వారికి గుణపాఠం చెబుతారు. జగనన్న పులివెందులలో లక్ష మెజార్టీతో, కడప ఎంపీగా అవినాష్రెడ్డి 5 లక్షల మెజార్టీతో గెలుస్తారు.
ఏపీ న్యాయ యాత్ర పేరుతో వైఎస్సార్ జిల్లాలో షర్మిల, సునీత పర్యటించి ఇష్టానుసారంగా మాట్లాడడంపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. వారిద్దరూ చంద్రబాబు నాయుడి స్క్రిప్ట్ చదువుతున్నారని చెబుతున్నారు. ఎల్లో మీడియా కూడా వారికి విస్తృత ప్రచారం కల్పిస్తుండడంతో ఇదంతా జగన్పై జరుగుతున్న కుట్రగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.