2024 సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో బిజెపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉన్న టిడిపి జనసేన పార్టీల తరఫున ప్రచారం చేయనున్నారని సమాచారం. మే 3 , 4 వ తేదీలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ విడుదలయింది. మే 3న పీలేరు, విజయవాడలో మోడీ పర్యటన ఉంటుంది. మే 4న రాజమండ్రి, అనకాపల్లిలో ప్రచారం చేయనున్నారు.
మే 3 మధ్యానం 2 గంటల 45 నిమిషాలకు జరగబోయే ఎన్నికల ప్రచారంలో రాజంపేట పార్లమెంట్ తరఫున పోటీ చేస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తరఫున ప్రచార సభలో పాల్గొంటారు. మే 3 సాయంత్రం విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటారు. మే 4 మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న పురందేశ్వరి తరపున రాజమండ్రి ప్రచార సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు, బిజెపి తరఫున అనకాపల్లిలో పోటీ చేస్తున్న సీఎం రమేష్ తరపున మోడీ ప్రచార సభలో పాల్గొంటారని బిజెపి పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు రెండు రోజులు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఇప్పటికి కేంద్ర బిజెపి అధిష్టానం ప్రకటించింది.