పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ బ్రోకర్ అని ఆ పార్టీ మాజీ నేత ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతిన మహేష్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తన అభిమానుల్ని తన కులాన్ని అడ్డంగా అమ్మేశాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాతనే ఎక్కువ ఆస్తులు కొనుగోలు చేశారని, ఆయనకు సినిమా రంగం కంటే రాజకీయ రంగమే బాగా కలిసి వచ్చినట్టు అర్థమవుతుందని పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ప్యాకేజీలు ఇచ్చారని, ఆ ప్యాకేజీ తోనే ఆస్తులను కొనుగోలు చేసిన స్పష్టమవుతుందని మహేష్ ఆరోపించారు.
పవన్ తన అఫిడవిట్లో తన ఆస్తుల విలువను 90కోట్లుగా చూపించారని, మార్కెట్ రేటు ప్రకారం ఆయన ఆస్తులు విలువ 400కోట్ల నుంచి 450కోట్ల రూపాయలు ఉంటుందని పోతిన మహేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదాయం 114కోట్లు, కట్టిన పన్ను 67కోట్లు కాగా, ఆయన ఇచ్చిన విరాళాలు 20కోట్లు పోతే మిగిలిన 20కోట్లతో 90కోట్ల విలువైన ఆస్తులు ఎలా కొన్నారో చెప్పాలని పోతిన మహేష్ లాజికల్ గా ప్రశ్నించారు
సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ లను కూడా అప్పులుగా చూపించిన అపర మేధావి పవన్ కళ్యాణ్ అంటూ పోతిన మహేష్ తిట్టిపోశారు. పవన్ కళ్యాణ్ ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీ చేయాలని, తేడా వస్తే శిక్ష కూడా వేయాలని వచ్చిన మహేష్ డిమాండ్ చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ అఫిడవిట్ లో పేర్కొన్న టెన్త్ క్లాస్ విద్యార్హత విషయం కూడా వివాదాస్పదమేనని పోతిన మహేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేశారని, చంద్రబాబు భజన చేయడం తప్ప పవన్ కళ్యాణ్ చేసింది ఏమీ లేదని పోతిన మహేష్ అసహనం వ్యక్తం చేశారు.