విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకి ఇవ్వకుంటే పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకొని పోటీ చేస్తానని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ ప్రకటించారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం పాలైన అందరూ పవన్ కళ్యాణ్ ని విడిచి వెళ్ళిపోతుంటే నేను మాత్రం ఆయనకు అండగా ఉన్నానని తెలిపాడు. 2024 సార్వత్రిక ఎన్నికల అభ్యర్థులు ప్రకటనలో నీ పేరు మొదటి లిస్టులో ఉంటుంది, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీని బాగా బలోపేతం చేశావ్ అని పవన్ కళ్యాణ్ చెప్పేవారు. తీరా మొదటి జాబితాలో తన పేరు లేకపోవడం చూసి కంగుతిన్నాను అని అన్నారు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ తో చర్చించగా మొదటి లిస్టులో నీ పేరు ప్రకటించలేదు లేదు, రెండో లిస్టులో కచ్చితంగా నీ పేరు ప్రకటిస్తా అని చెప్పాడని అన్నారు.
రెండో జాబితాలో కూడా తన పేరు లేకపోవడం చూసి ఎంతో మనోవేదనకు గురైనట్లు ఈ సందర్భంగా తెలిపారు. రెండో జాబితాలో తన పేరు ఎందుకు ప్రకటించలేదో తెలీదు, దానికి సంబంధించి తనకు ఎటువంటి సమాచారం అందలేదని పోతిన మహేష్ తెలిపారు. పార్టీ ప్రారంభించినప్పుడు నుంచి పార్టీ కోసం కష్టపడిన వాళ్లకి టికెట్ ఇవ్వకుండా, కొత్తగా పార్టీలో చేర్చుకొని వారికి టికెట్ ఇవ్వడం ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు.ప్రస్తుతం మీడియా ద్వారా పార్టీ ముఖ్య నాయకులు ద్వారా తెలుస్తోంది ఏంటంటే పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీట్ ను బిజెపికి కేటాయించినట్లు తెలుస్తోందని, ఒకవేళ అదే నిజమైతే తాను రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని ప్రచారం చేస్తానని ప్రకటించారు.