ఏపీ లో చంద్రబాబు వాలంటీర్ల సేవలను అడ్డుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ కోసం పొద్దుపొద్దునే అవస్థలు పడుతూ సచివాలయాలకి చేరుకుంటున్న అవ్వాతాతలు. మళ్లీ 55 నెలల తరువాత వృద్ధులను రోడ్ల మీదకు తీసుకువచ్చాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడిక్కడ వికలాంగులు, వృద్ధులు ఫించన్ కోసం గ్రామ సచివాలయలకు క్యూ కట్టారు. కొంతమంది రెండు రోజుల నుండి వాలంటీర్లు రాకపోవడంతో ఇంటికి వచ్చి ఫించన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు అని తెలిసి మనోవేదనకు గురి అయ్యి శాపాలు పెట్టసాగారు.
నరసరావుపేటలో ఒక వృద్దురాలిని వీపుకి జోలి కట్టుకొని తీసుకొని వచ్చే సన్నివేశం చూసి అయ్యో పాపం అనని సామాన్యుడు లేడు . మరి కొన్ని చోట్ల నడవలేని స్థితిలో వున్న అవ్వా తాతల్ని వీల్ చైర్ లో , మంచాల మీద తీసుకువస్తున్నారు అవి చూడటానికి హృదయ విదారకంగా వున్నాయి. చేతి కర్ర సపోర్ట్ తో ఈ ఎండలకు కిలోమీటర్లు దూరం ప్రయాణించి సచివాలయంకు చేరుకోవడం వాళ్ళకు శక్తికి మించిన పని అవుతుంది.గిరిజన ప్రాంతాల్లో కొండ కొనలు దాటి రావటంతో వృద్ధులు ఈ ఎండలకు తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతున్నారు.
గత ఐదేళ్లు గా వీళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి నెలలో మొదటి రోజునే ఇంటికి వచ్చి ఫించన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి వృద్ధులకు, వికలాంగులకు ఎంతో మేలు చేశారు. ఆలాంటి వ్యవస్థ ను తన రాజకీయ లబ్దికోసం ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదులు చేసి అడ్డుకున్నారు. ఈరోజు రాజకీయ దుర్బుద్ది తో ఏ పాపం ఎరుగని వీళ్ళను రోడ్డెక్కేలా చేశారు చంద్రబాబు నాయుడు , ఈ పాపం ఊరికే పోదు,నీకు ఈ ముసలి అవ్వ తాత లే తగిన బుద్ది చెబుతారు అని తమ నిరసనలు తెలియచేస్తున్నారు. పెన్షన్ కోసం ప్రతి చోట అవ్వలు కన్నీళ్లతో అడుగుతున్న ప్రశ్నలకి ఈ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏమని సమాధానం చెప్తారో ?
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు వృద్ధుల కోసం మంచి నీరు, మజ్జిగ, సచివాలయం దగ్గర షామియానాలు ఏర్పాటు చేసి కొంతలో కొంత ఉపశమనం కలగజేస్తు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.