కాపు సామాజికవర్గం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను నమ్ముకుంటే వారిని నట్టేట ముంచేశాడు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి చెంత చేరి ఆయన్ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రయత్నిస్తున్నాడు. దీనిని కాపులంతా వ్యతిరేకిస్తున్నా సేనాని వినడం లేదు. వాళ్లంతా తనను వీడుతున్నా బాబు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నాడు.
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన వారి అభ్యున్నతికి కృషి చేస్తోంది. కాపు కార్పొరేషన్ ద్వారా రూ.15,044.64 కోట్లతో వైఎస్సార్ కాపు నేస్తం, జగనన్న విద్యాదీవెన, అమ్మఒడి, వాహనమిత్ర, వసతి దీవెన, పెన్షన్ కానుక, చేదోడు, ఆసరా తదితర పథకాలను అమలు చేసింది. 58 నెలలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ కింద జగన్ సర్కారు రూ.39,317.80 కోట్లు అందించింది. 2023–24 సంవత్సరానికి జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద 23 మంది కాపు విద్యార్థులకు రూ.లక్ష చొప్పున అందించారు. ఐదు కాపు భవనాల నిర్మాణానికి రూ.100 కోట్లు విడుదల చేశారు. నెల్లూరు, బాపట్ల జిల్లా ఏల్చూరు, అడవిపాళెం, చందలూరుల్లో భవన నిర్మాణాలు పూర్తయ్యాయి.
అదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చూస్తే కాపు కార్పొరేషన్కు 2014 నుంచి 17 వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2017 నుంచి 19 వరకు రూ.1,874 కోట్లు ఇస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇచ్చింది రూ.1,334 కోట్లు. బకాయి పెట్టిన మొత్తాన్ని జగన్ సర్కారు విడుదల చేసింది. గతంలో రాయితీ రుణాలను ఎగ్గొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 19 మంది లక్షలకు పైగా రూ.3,260 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది.
ఈ లెక్కలన్నీ వింటే పవన్కు మతిపోవడం ఖాయం. అసలు వినరు కూడా. ఆయనకు చంద్రబాబే నచ్చుతారు. టీడీపీ కాపులకు ఏమీ చేయలేదని గణాంకాలు చెబుతున్నా వారిచ్చిన సీట్లు తీసుకున్నాడు. కాపులకు అండగా ఉండడం అంటే ఇదేనా అని ఆ సామాజికవర్గం యువత సేనానిని ప్రశ్నిస్తోంది. అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూసే నారా వారికి.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాపు కాసిన జగన్కు చాలా తేడా ఉంది పవన్..