టీడీపీ నాయకులు తమ సామాజిక వర్గానికి చెందిన ఏరియాలో ఓట్లు అడగవద్దని ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య ను అడ్డుకొని పరుష పదజాలంతో తిట్టడమే కాకుండా చుట్టూ ఉన్న వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ దాడుల నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకొని ముందు గొడవ చేసి, ప్రచారం ను అడ్డుకున్న టీడీపీ వారిని ఎందుకు ఇప్పటి వరకు అరెస్టు చెయ్యలేదు కేవలం టీడీపీ వారి దాడిని అడ్డుకున్న మా వైసీపీ కార్యకర్తలను ఉద్దేశ్యపూర్వకంగా ఆరెస్ట్ చెయ్యడం సబబు కాదు అసలు ఈ గొడవ మొత్తానికి కారణమైన కానిస్టేబుల్ చౌదరిని ఇప్పటి వరకు కనీసం విచారణకు పిలవలేదు అని తన ఆందోళన వ్యక్తం చేశారు.
టీడీపీ లోని చంద్రబాబు సామాజిక వర్గ నాయకులు ఇప్పుడే కాదు గతంలో కూడా 2019 లో మా ప్రాంతంలో వైసీపీ ప్రచారం గానీ ఎలక్షన్ ఆఫీస్ కూడా ఓపెన్ చెయ్యవద్దు అని 8 గంటలు గొడవలు చేసి దాడులు చేసారు. అలాగే ఈ రోజు సమతా నగర్ లో నా తరుపున ప్రచారం చేస్తున్న నా కోడల్ని మా సామాజిక వర్గం ఏరియాలో మీరు ప్రచారం చెయ్యవద్దు అని అడ్డుకొని ఇష్టమొచ్చిన రీతిలో తిట్టి, తనతో ప్రచారానికి వచ్చిన మాజీ మహిళ వాలంటీర్ను గర్భవతి అని చూడకుండా దాడులు చేశారు, అలాగే మాజీ వాలంటీర్లపై దాడి చేసి గాయపరిచారు. ఇంత చేసిన కానిస్టేబుల్ చౌదరిని, కార్పొరేటర్ వేణు గోపాల్ చౌదరిని, మోహనరావు ను పోలీసులు కనీసం విచారణకు పిలవలేదు దీనిని మేము సహించే ప్రసక్తే లేదు అని బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. అలాగే మాగుంట శ్రీనివాసులురెడ్డి నీ నేను ఎంతో గౌరవించాను, ఈరోజు తన కోడలిపై దాడి చేసిన వారికి మాగుంట మద్దతు ఇవ్వడం మనస్సుకు భాద అనిపించింది అని తెలిపారు.