అమెరికా లో స్థిరపడిన ఓ ఆంధ్ర వ్యక్తి ఈ మధ్య ఇండియా కి వచ్చి ఆంధ్రలో ప్రభుత్వ బడులను చూసి ఆశ్చర్యపోయి తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా పంచుకున్నారు….సెలవులకి కి ఇండియా వెళ్లొచ్చిన ఓ ఫ్రెండ్, వాళ్ళ ఊరిలో ప్రభుత్వ పాఠశాల గురించి చెప్పాడు .ఆంధ్ర లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ గురించి అమెరికా లో మాట్లాడుకోవటం ఈ మధ్యే వింటున్నా .ఆసక్తి గా అనిపించి చదివా…
అమ్మ ఒడి :
పిల్లల్ని స్కూల్ కి పంపిస్తే చాలు ప్రభుత్వ పాఠశాల స అయినా ,ప్రైవేట్ స్కూల్ అయినా, ఏడాదికి ప్రతి తల్లికి పదిహేను వేలు ఇస్తున్నారు .ఇప్పటివరకు ఉన్న లబ్ధిదారుల వివరాల్లోకి వెళ్తే, లబ్ది పొందుతున్న తల్లులు – 43 లక్షలు కాగా, విద్యార్థులు -83 లక్షలు, ఖర్చు దాదాపు 6000 కోట్లు…
మనబడి నాడు-నేడు :
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచి స్కూల్స్ కి కొత్త రూపం ఇవ్వటం కోసం చేపట్టిన కార్యక్రమం ఇది, ఈ ప్రాజెక్ట్స్ కింద మరుగుదొడ్లు, రక్షిత మంచినీరు, బిల్డింగ్ రిపేర్లు, లైట్ లు, ఫ్యాన్లు, కుర్చీలు, బల్లలు, గ్రీన్ బోర్డు లు, పాఠశాల భవంతికి రంగులు, ప్రహారీ గోడ, అదనపు తరగతి గదులు, ఇంగ్లీష్ ల్యాబ్స్ అని మొత్తం తొమ్మిది కాంపోనెంట్స్, తీసుకున్నారు .ఇప్పటికి 15,000 స్కూల్స్ ని ఆధునికీకరణ చేశారు. ఫేజ్ -2, మరియు పేజ్ -3లో ఇంకో 25,000 బాగు చేయనున్నారు… ఇలాంటి కార్యక్రమం
దేశం లోనే మొదటి సారి చేపట్టారు. దీనికి ఖర్చు ఇప్పటికీ -15,000 కోట్లు
విద్యా దీవెన :
గతంలో ఉన్న ఫీజు రీయింబర్సుమెంట్ కి ఇది కొత్త రూపం ఇది. కాలేజీ ఫీజులను క్రమబద్ధీకరించి, వారి స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఫీజు నిర్ణయించి, ఫీజులో కొంతభాగం కాకుండా మొత్తం ఫీజుని పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఇస్తున్న ప్రాముఖ్యత ఇది. లబ్దిదారులైన విద్యార్థుల సంఖ్య -11.8 లక్షలు కాగా ఈ పథకానికయ్యే మొత్తం ఖర్చు 3,400 కోట్లు…
వసతి దీవెన :
డిగ్రీ ,ఇంజనీరింగ్ ,మెడికల్ ,ఐటిఐ, పాలిటెక్నిక్ లాంటి కోర్సెస్ చదివే స్టూడెంట్స్ కి వసతికోసం, వారి భోజనానికి అయ్యే ఖర్చు భరించడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఖర్చు 4000 కోట్లు..
విద్యా కానుక : 1 నుండి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కిట్లు ఇచ్చే ప్రోగ్రాం ఇది… ఒక్కో కిట్ ధర దాదాపు 2,400 రూపాయలు. ఈ కిట్ లో లో తెలుగు- ఇంగ్లీష్ లో ప్రింట్ చేయబడిన పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్, మూడు జతలు యూనిఫామ్, బెల్ట్, స్కూల్ బాగ్ ,ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ, పిక్టోరియల్ డిక్షనరీ ఉంటాయి. యూనిఫార్మ్ స్ట్రిచింగ్ ఛార్జ్ విడిగా ఇస్తారు. మొత్తం ఖర్చు 750 కోట్లు…
గోరుముద్ద :
ప్రభుత్వ పాఠశాల లో చదువుకుంటున్న పేద పిల్లలకు ఇచ్చే మధ్యాహ్న భోజన పథకం లో సమూల మార్పులు చేస్తూ తీసుకొచ్చిన పథకం ఇది.. వారానికి 15 రకాల వంటలు, వారంలో 5 రోజులు గుడ్లు, 3 రోజులు చిక్కి, రాగి జావ ఇలా వారం లో రోజుకో మెనూ సిద్ధం చేసి దాని ప్రకారమే పిల్లలకి భోజనం అందిస్తున్నారు…నీతి ఆయోగ్ వారి లెక్కల ప్రకారం పోషన్ అభియాన్ పథకాన్ని అత్యుత్తమం గా అమలు చేసిన రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానం లో నిలబడింది.. దీనికైన ఖర్చు -1600 కోట్లు…
స్వేచ్ఛ :
ప్రభుత్వ పాఠశాలలకి వెళ్లే ఆడపిల్లల డ్రాపౌట్ లని తగ్గించడం కోసం ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన పథకం ఇది, వయసుకొచ్చిన ఆడపిల్లల అందరికీ నెలకు పది సానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం ఈ పథకం యొక్క ఉద్దేశం…
డిజిటల్ విద్య :
ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ నూతన బోధన విధానాలను ప్రవేశపెట్టి మన విద్యార్థులను ప్రపంచస్థాయి విద్యార్ధులుగా తీర్చిదిద్దే ప్రణాళిక రచించబడింది అని కింది విషయాలు స్పష్టం చేస్తున్నాయి…
1 – ఇంగ్లీష్ మీడియం..
2 -45,000 స్కూల్స్ కి ఇంట4ర్నెట్ సౌకర్యం..
3 -2024 విద్యా సంవత్సరానికి ప్రతీ స్కూల్ కి DTH సౌకర్యం కల్పించడం ద్వారా, శాటిలైట్ ద్వారా క్లాస్ లు నిర్వహించడం.
4 – సాంప్రదాయ సిలబస్ స్థానం లో ఐబీ సిలబస్..
5 -EDX ద్వారా, ప్రపంచస్తాయి అవసరాలకు తగ్గట్టు గా కోర్స్ లని ఉచితంగా అందించడం..
6 – e- పాఠశాల లు..
7 – పాశ్చాత్య భాషలను నేర్చుకోవడానికి Duo-lingo యాప్ ద్వారా సేవలు..
8 – వృత్తి విద్య..
9 -60,000 టీచర్స్ కు, 4.6 లక్షల మండి 8వ తరగతి పైబడిన విద్యార్థులకు ఉచితంగా టాబ్స్(బైజూస్ కంటెంట్ ఉన్న ఒక్కో టాబ్ విలువ ౩౩,౦౦౦ రూపాయిలు )..
10 -ఇవికాక సెంట్రల్ సిలబస్ తో ఎనిమిది కేంద్ర విశ్వవిద్యాలయాలు…
అన్నీ వెరసి ఒక్కోసంవత్సరానికి విద్యమీద ప్రభుత్వం పెడుతున్న ఖర్చు అక్షరాలా ముప్పైరెండువేల (32,000 ) కోట్లు. ఇది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో 16% గా ఉంది…
All India survey of Higher Education report ప్రకారం ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి దేశ సగటు 3.04 % అయితే ఆంధ్ర ప్రదేశ్ ది మాత్రం 8.6 % గా నమోదు అయింది…
ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చే విద్యా అందుబాటు ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ “అతి ఉత్తమ్” రాష్ట్రం గా నిలిచింది…
2018-19 లో పాఠశాల స్థూల నమోదు నిష్పత్తి దేశ సగటు 99.21 ఉండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అది 84.48 మాత్రమే ఉంది… అది 2023 నాటికి 100% కి చేరింది…
నీతి ఆయోగ్ విడుదల చేసిన 2023- స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ (SEQI) ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం లో నిలిచింది..
ఇలా విద్యా విషయం లో ఏ ఇండెక్స్ లో అయినా గత నాలుగున్నర ఏళ్లలో ఆంధ్ర ప్రదేశ్ మెరుగుగా ఉంది…
ఇలా విద్యపై చేస్తున్న పెట్టుబడి భవిష్యత్ లో మన విద్యార్థులు ప్రపంచ స్థాయి పౌరులుగా మారడం, మన సాంకేతిక పరిజ్ఞానం, విద్యా స్థాయి పెరగడం వలన రాష్ట్రమే కాక దేశం కూడా అతి వేగం గా ప్రగతి సాధించడం లో దోహదం చేస్తుంది.. అప్పటికి ఈ ప్రభుత్వ ముద్ర ఎవరు చెరిపేయాలని చూసినా చెరగదు…