తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేరు చెబితేనే గుర్తుకు వచ్చే పదం “రెండు కళ్ళ సిద్దాంతం” అవసరానికి తగ్గట్టు మాటలు మార్చడం , చీకటిలో రాజకీయాలు చేసి బయటికి నాకేం తెలియదనట్టు నటించడం ఆయనకి తెలిసినంతగా మరొకరికి తెలియదు. రాజకీయ అవసరాలకోసం ఒక పని చేసి ప్రజా వ్యతిరేకత నుండి తప్పించుకోవడానికి అదే పని విషయంలో మరో మాట మాట్లాడటంలో ఆయనని మించిన నాయకుడు ఈ ప్రపంచంలోనే ఉండరు. ఇప్పటికే చంద్రబాబు సిద్దాంతానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు ఆ జాబితాలోకి వాలంటీర్లు పెన్షన్ పంపిణీ కూడా వచ్చి చేరింది.
జగన్ ప్రభుత్వం రాగానే పరిపాలనా వ్యవస్థలో విప్లవాత్మకమైన అనేక మార్పులు తెచ్చారు , అందులో వలంటీర్ల వ్యవస్థ ఒకటి, ఈ వ్యవస్థ ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇంటివద్దే పింఛన్లు అందిస్తూ ప్రతి గడపకూ పాలన చేరువ చేశారు. అయితే పేదలకి వృద్దులకి మొదటి నుండి అండగా ఉంటున్న ఈ వ్యవస్తపై చంద్రబాబు కత్తి కట్టారు, ప్రతి విషయంలోనూ అవకాశం కల్పించుకుని వాలంటీర్లను తూలనాడుతూనే వచ్చారు నేడు ఏకంగా తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత సిటిజన్ డెమొక్రటిక్ ఫోరం పేరుతో పింఛన్ల పంపిణీకి అడ్డుపడి ఈసీకి ఫిర్యాదులు చేసి ఆపించి కసి తీర్చుకున్నారు. ఇదే నిమ్మగడ్డ రమేష్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా ఏ స్థాయిలో పని చేశారో అందరికీ తెలిసిందే. ఇంతా చేసిన చంద్రబాబు రెండు కళ్ళ సిద్దాంతంలో భాగంగా మళ్లీ వారే పింఛన్ల పంపిణీకి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
చంద్రబాబుకి ఈ రెండు కళ్ళ సిద్దాంతం కొత్తేం కాదు , గతంలో కూడా దివంగత వైయస్సార్ గారి పాలనా హయాంలో పోలవరం ప్రాజెక్టు పై వారి మనుషులచేతే కేసులు వేయించి ఆపించి, మళ్ళీ పోలవరంపై ముసలి కన్నీరు కార్చారు, కాపులని బీసీల్లో చేర్చే విషయంలో , కుప్పాన్ని వైసీపీ మున్సిపాలిటీగా మార్చిన విషయంలో , తెలంగాణ ఆంద్రా విభజన సమయంలో , మాల-మాదిగల విషయంలో ఇప్పుడు పెన్షన్ పంపిణీ విషయంలో.. చంద్రబాబు తీరు చూసి ఇలాంటీ వ్యక్తి సమాజంలో ఉండటానికే అర్హత లేదని, తమని ఇంత కష్ట పెడుతున్న చంద్రబాబుకి మళ్ళీ ఓటమి తప్పదని నష్టపోయి కష్టం పడుతున్న వృద్దులు వికలాంగుల మాటగా వినిపిస్తుంది.