వాలంటీర్లు పెన్షన్ ఇవ్వొద్దు, అకౌంట్లలో వెయ్యండి లేదా ఆ ముసలాల్లనే వచ్చి తీసుకుపొమ్మనండి: హై కోర్ట్ లో నిమ్మగడ్డ పిటిషన్…
బాబు ప్రయోజనాల కోసం ఎందాకైనా… అంటూ ముందు ఉండే ఒక వర్గం లో సభ్యుడైన మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ మరోసారి బాబు ప్రయోజనార్ధం ముందుకు వచ్చాడు. ఇంటింటికి పథకాలు అందిస్తూ, ఇంట్లో మనిషిగా మెలుగుతూ, ఏ కష్టం వచ్చినా బంధువులు వచ్చినా రాకున్నా మేమున్నాం అంటూ ఏపీ ప్రజలకు చెడోడువదోడు గా ఉంటున్న వాలంటీర్ల పై టీడీపీ అండ్ కో ముందు నుండి విషం కక్కుతూనే ఉంది. వాలంటీర్ వ్యవస్థ వల్ల, వారు అందిస్తున్న నిష్కళమశమైన సేవ వలన సీఎం జగన్ కు అన్ని వర్గాల నుండీ మంచి పేరు రావడమే దానికి కారణం..
ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ ఒకటో తారీఖు అవ్వగానే పొద్దు పొడవకముందే ఇంటి వద్దకే వాలంటీర్ పెన్షన్ తీసుకువచ్చి ముసలి అవ్వా, తాతలకు, వికలాంగులకు, వితంతువులకు ఇస్తే గత ప్రభుత్వం లో తాము పెన్షన్ కోసం పడ్డ కష్టాలు, కిలోమీటర్ల కొద్ది ప్రయాణం, గంటల కొద్దీ నిరీక్షణ అన్నీ ఎక్కడ గుర్తొచ్చి వైసీపీ కే ఓటు వేసి మరోసారి గెలిపిస్తారో అన్న భయంతో నిమ్మగడ్డ రమేష్ హై కోర్ట్ లో పిటిషన్ దాకలు చేశాడు..
ఎన్నికల నేపథ్యం లో వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి వీల్లేదని, పెన్షన్ తీసుకునే వారికి తమ అకౌంట్ లలోనే నేరుగా జమ చేయాలి అనీ, అకౌంట్ లు లేని పక్షం లో వారే వచ్చి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయమని నిమ్మగడ్డ రమేష్ కోర్ట్ ను ఆశ్రయించాడు. నిరుపేద, నిర్భాగ్య ప్రజలు అంటే టీడీపీ కి వారి మద్దతుదారులకు ఎప్పుడు చిన్నచూపే. వారికి మంచి జరిగితే ఓర్వలేరు, మంచి చేసే వాళ్లని చూసి తట్టుకోలేరు.. రానున్నది ఎండాకాలం ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవాకాశం ఉంది, వాలంటీర్ల ద్వారా కాకుండా గతం లో లా పెన్షన్ ఆఫీసు వద్దకే వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎండలో క్యూ లైన్ లలో నిలబడి నిర్భాగ్యులైన వృద్ధులు మరణిస్తే ఆ పాపం ఎవరికి అంటుకుంటుంది.? పేద ప్రజల కడుపు కొట్టి లబ్ధిపొందాలి అనుకోవడం టీడీపీ కి పరిపాటి అయింది..
మరోవైపు వలంటీర్లపై ఫిర్యాదులు చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో టీడీపీ చేపడుతున్న ఫేక్ ప్రచారాన్ని ఏపీ సీఈవో కార్యాలయం ఖండించింది. రాజకీయ ప్రచారంలో పాల్గొనే వలంటీర్లను ఎవరైనా మీ కంట కనబడితే వారి ఫోటోలు,వీడియోలతో పాటు వలంటీర్ల పేరు, ఊరు పేర్లు తెలియజేస్తూ ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, లోకేషన్ను 9676692888కు వాట్సాప్కు షేర్ చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వలంటీర్లపై ఫిర్యాదులు చేయాలంటూ తామెలాంటి సర్క్యూలర్ జారీ చేయలేదని, ఇదీ ఫేక్ న్యూస్ అంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఏపీ సీఈవో పేర్కొన్నారు.
మొత్తానికి జగన్ ఆలోచన నుండి పుట్టుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ టీడీపీ అండ్ కో గుండెల్లో రైళ్లు పరిగెట్టే లా చేస్తుంది…