తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబసభ్యులకు అబద్ధాలు చెప్పడం చాలా ఇష్టం. ప్రజల కోసం బాబు చేయని పనులను ఆయన ఖాతాలో వేస్తుంటారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమాన్ని మధ్యలో ఆపేశారు. ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో తిరిగి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆమె బుధవారం పాడేరులో పర్యటించారు. గిరిజన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంలో గిరిజన సంక్షేమమే చంద్రబాబు లక్ష్యమని, ఆ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేశారని ఆమె సెలవిచ్చారు. అంతటితో ఆగకుండా జగన్ పథకాలు రద్దు చేశారని, చంద్రబాబు అధికారంలోకి వస్తేనే గిరిజనులకు భవిష్యత్ ఉంటుందని నోటికొచ్చింది చెప్పేశారు. కాకపోతే నిజాలు మరోలా ఉన్నాయి.
2014 మేనిఫెస్టోలో బాబు గిరిజనులకు అనేక హామీలిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలేశారు. ఇందులో ప్రధానమైనవి చూస్తే ఒక్కో కుటుంబానికి రెండు ఎకరాల భూమిని ట్రైకార్ ద్వారా కొనుగోలు చేసి ఇస్తాం. ఒక్కొక్కరికి రూ.1.50 లక్షలతో ఉచితంగా ఇల్లు కట్టిస్తాం. గిరిజన తండాలు, గూడెంలకు మౌలిక వసతులు కల్పిస్తాం. జనాభా ప్రాతిపదికన నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇస్తాం. ప్రతి జిల్లాలో గిరిజన భవన్ నిర్మిస్తాం. ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తాం. ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా నెరవేర్చని ఘనత బాబుకే దక్కుతుంది. అధికారంలో ఉన్న 14 ఏళ్లు వారి కోసం ఏమీ చేయలేదు.
కార్పొరేషన్కు చైర్మన్ను నియమించలేదు. నాలుగున్నరేళ్లు ఆయన కేబినెట్లో ఒక్క గిరిజన మంత్రి కూడా లేరు. ఎన్నికల్లో సానుభూతి కోసం కిడారి శ్రావణ్ను మంత్రిని చేశారు. అరకు నియోజకవర్గంలో దత్తత తీసుకున్న గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు. ఒక్క ఎకరా పోడు భూమి పట్టాను ఇచ్చిన పాపాన పోలేదు. పోలవరం ఆర్ఆర్ ప్యాకేజీలో గిరిజనులకు అన్యాయం చేశారు. తనను ఓడించారని ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకున్న ఘనత నారా వారిది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ సంపద పైనే ఎల్లో గ్యాంగ్కు ప్రేమ. టీడీపీ ఐదేళ్ల పాలనలో బాక్సైట్ తవ్వకాల పేరిట గిరిజనుల ఆస్తులను దోచుకున్నారు. గిరిజన సలహా మండలి గురించి పట్టించుకోలేదు. ట్రైబల్ అడ్వైజరీ బోర్డును పెట్టలేదు. దళారీ వ్యసవ్థ ద్వారా గంజాయి సాగును ప్రోత్సహించారు.
ఇక జగన్ విషయానికొస్తే రాష్ట్రంలోని 38 లక్షల మందికి పైగా ఉన్న గిరిజనుల సంక్షేమానికి పాటుపడ్డారు. ఎస్టీ కమిషన్ పెట్టారు. తండాల్లో వసతులు కల్పించారు. 3.26 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. రూ.400 కోట్లతో గిరిజన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. రూ.834 కోట్లతో 562 ఎకరాల్లో ట్రైబర్ యూనివర్సిటీ పనులు జరుగుతున్నాయి. అసలు జగన్ చొరవతోనే అరకు కాఫీకి అంతర్జాయతీ ఖ్యాతి దక్కింది. గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపి ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో బాక్రైట్ తవ్వకాలను నిషేధించారు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి.
భువనేశ్వరి హైదరాబాద్ నివాసి కావడం, నిత్యం హెరిటేజ్ వ్యాపారాల్లో తలముకనలై ఉండటంతో వాస్తవాలు తెలిసినట్లు లేదు. ఆమె భర్త 2014 మేనిఫెస్టోను తుంగలో తొక్కారు. 2024లో ఆయన్ను నమ్మి అధికారం ఇస్తే అద్భుతాలు చేస్తారని చెబుతున్నారు. ఒకవేళ బాబు చేయకపోతే భువనేశ్వరి హెరిటేజ్ ఆస్తులు చేస్తారా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.