టీడీపీ హయాంలో మహిళలకు మకుటం అంటూ నారా భువనేశ్వరి ప్రచారం చేస్తుంది కానీ, టీడీపీ పాలనలో ఎంతో మంది మహిళలు టీడీపీ అకృత్యాలకు బలయ్యారు. 2014 టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళ అధికారి నుంచి చిన్న పిల్లలు దాకా కనీసం యాచకులును కూడా వదల్లేదన్న విషయం భువనేశ్వరికి తెలియదా? తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారా? బాబు వస్తే మహిళకు భరోసా అంటూ ఉపన్యాసాలిస్తున్న భువనేశ్వరి, మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొని వస్తే కోర్ట్ కి వెళ్లి చట్టం అవ్వకుండా స్టే తెచ్చిన చంద్రబాబు గురించి ఎందుకు నోరు మెదపడం లేదు. రిషితేశ్వరి అత్మహత్మ చేసుకున్న సమయంలో ఆమెకి న్యాయం జరగకుండా రిషితేశ్వరి తల్లితండ్రులను భయపెట్టి పంచాయతీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. చంద్రబాబు గత అయిదేళ్ల పాలనలో మహిళలకి ఇచ్చిన రక్షణ, గౌరవాన్ని తొంగిచూస్తే కింది విషయాలు అవగతమవుతాయి.
1) కులం కంపుతో “రిషితేశ్వరి” ఆత్మహత్య
2) మహిళా అధికారి వనజాక్షి మీద ఎమ్మెల్యే చింతమనేని దాడి
3) అమ్మాయి కనబడితే కడుపన్న చెయ్యాలి, ముద్దన్నా పెట్టాలి – బాలయ్య డైలాగ్
4) కామ సీఎం (కాల్ మనీ సీఎం ) అన్నందుకు ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుండి ఏడాది సస్పెండ్.
5) కారుతో మహిళ వెనక పడి వేధించి , కారుకి కుక్క అడ్డం వచ్చిందని కధ చెప్పిన మంత్రి కొడుకు
6) డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణ మాఫీ హామీ
7) మంత్రి నారాయణ విద్యా సంస్థల్లో పలువురు విధ్యార్థినుల ఆత్మ హత్యలు
8 ) విమానంలో ఎయిర్ హోస్టెస్ తో స్పీకర్ దురుసు ప్రవర్తన.
9) విశాఖ గిరిజన హాస్టల్ స్కూల్ ఆడపిల్లల మీద లాఠి చార్జ్
10) డ్వాక్రా మహిళలని బూతులు తిట్టిన ప్రజాప్రతినిధి
11) బెజవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర అంగన్ వాడి మహిళల మీద లాఠి చార్జ్
12) కాల్ మనీ పేరిట అధిక వడ్డీలకు అప్పులిచ్చి మహిళలని వేధించి సెక్స్ రాకెట్ లోకి దించిన టీడీపీ నేతలు
13) రాజ్య సభ సాక్షి గా ఆడవారి దుస్తుల మీద కామెంట్లు చేసిన ఘనులు
14) ఇళ్ళ పట్టాలు అడిగినందుకు ఇల్లందుపూర్ జన చైత్యన యాత్ర నుండి మహిళల గెంటి వేత.
15) బాక్సైట్ విషయంలో గిరిజనులకి అండగా మాట్లాడినందుకు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మీద పోలీస్ కేసు.
16) బెజవాడలో సమస్యలు పరిష్కరించమన్న ఆశా వర్కర్లు అరెస్ట్
17) కర్నూల్ సాయి లాడ్జ్ లో 16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన తెలుగుదేశం నాయకుడి బంధువు.
18) కోడలు మగబిడ్డను కంటా అంటే ఏ అత్తయినా వద్దు అంటుందా అన్న సీఎం
19) కాళహస్తి దేవాలయంలో మహిళా ఈవోని దుర్భాషలాడుతూ చిందులు వేసిన దేశం నాయకుని కొడుకు
20) గంగ జాతరలో ఎమ్మెల్యే హోదాలో హారతి ఇస్తున్న రోజా గారిపై కత్తితో దాడి చేసి గాయపరిచిన టీడీపీ నేతలు.
21) ఓటుకు నోటు వ్యవహారం పసిగట్టనందుకు గాను ఇంటిలిజెన్స్ ఐజి అనురాధా గారిని విజిలెన్స్ అండ్ ఈడి అడిషినల్ డిజిపిగా ట్రాన్స్ఫర్
22) విమానంలో సాటి ప్రయాణికురాలిని వేధించిన టీడీపీ కార్పొరేటర్
23) పూనా రైల్వే స్టేషన్ లో తాగి మహిళ వెంట పడిన కార్పొరేటర్లు
24) చిన్న పిల్లల నగ్న చిత్రాలు తీసిన ఎంపీ అనుచరులు
25) మే డే (కార్మిక దినోత్షవం) రోజునే విశాఖ బ్రాండిక్స్ ఫ్యాక్టరీ మహిళా కార్మికులమీద లాఠీ చార్జ్
26) సంచలనం రేపిన లావణ్య హత్య కేసులో నిందితులని కాపాడి 10.25 లక్షలకి సెటిల్మెంట్ చెసిన టిడిపి నేతలు
27) మెడికో సంధ్యా రాణి ఆత్మహత్య కేసు వైఫల్యం చెందడం వెనుక టీడీపీ నేత హస్తం
28) సమస్యలపై నిలదీసిన వరలక్ష్మి పైకి మైకు విసిరిన తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామ కృష్ణ.
29) చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగుళ్ళు మహిళా తాశీల్దారు నారాయణమ్మ మీద టీడీపీ సర్పంచ్ దాడి..
30) తెలుగుదేశం గ్రూపు రాజకీయాలకి తట్టుకొలేక మాచర్ల మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి పురుగుమందు తాగి ఆత్మహత్య.
31) బద్వేల్ పుట్టాయంపల్లికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్ధిని ఉషారాణి ర్యాగింగ్ వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య
32) బాపట్ల ఎంపీపీగా గెలిచిన విజేతమ్మను టీడీపీ జిల్లా అధ్యక్షుడే రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యారు.
33) విశాఖలో ప్రేమికుల రోజున బీచ్ ఫెస్టివల్ పేరుతో బికిని షో పెట్టించటానికి విశ్వప్రయత్నం చేసి విఫలమైన టీడీపీ ప్రభుత్వం
34) మంత్రి పరిటాల సునీత సమక్షంలో వైయస్ఆర్సిపి – యంపిటిసి సభ్యురాలు గంగమ్మ పై టిడిపి నేతల దాడి.
35) మంత్రి రావెల కిషోర్ నుండి నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ అనుచరులు నా ఇంటిమీద దాడి కూడా చేశారు అని మీడియా ముందు రోదించిన తెలుగుదేశం గుంటూరు జెడ్పి చైర్ పర్సన్ – జానీమూన్
36) గుంటూరుకి చెందిన పద్మజ అనే మహిళకి చెందిన 8 కోట్లు విలువ చేసే ఇంటిని బ్యాంకు వారితో కుమ్మక్కై కబ్జా చేసిన తెలుగుదేశం ఎంపీ గళ్లా జయదేవ్.
37) స్కూటి మీద వెళ్తున్న మా అక్క గౌతమి ని టీడీపీ నేత సజ్జా బుజ్జి కారుతో వెంటాడి గుద్ది చంపారు. ఆ ప్రమాదంలో గాయపడిన గౌతమి గారి చెల్లి పావని.
38) తన ఇంటికి వెళ్ళే దారిలో కడుతున్న ట్యాంకు కొంచెం పక్కన కట్టుకుంటే ఇంటికి దారి ఉంటుంది అని అడిగినందుకు మాకే ఎదురు చెబుతావ అని అనంత టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అనుచరులు జల్లిపల్లి టీడీపీ సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ మెంబర్ చంద్ర కలిసి సుధ అనే మహిళను రోడ్డుపై పడేసి కొట్టారు.
39) కారు షెడ్డుకి, ఆడవారు వంటింటికే పరిమితం అయితే యాక్సిడెంట్లు వేధింపులు ఉండవు అన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు.
40) వికృత చేష్టలతో ఎన్ఆర్ఐ మహిళను వేధించిన జగయ్యపేట తెలుగుదేశం నేత అక్కినేమి లోకేశ్వర రావు కుమారుడు విజయకృష్ణా.
41) అత్తింటి వేధింపులు తట్టుకోలేక కేసు పెట్టి మీడియాకెక్కిన స్పీకర్ కోడెల శివప్రసాద్ కోడలు శివరామ్ భార్య పద్మప్రియ
42) ఆహ్వానం ఉన్న మహిళా పార్లమెంట్ కి రానీయకుండా మహిళా ఎమ్మెల్యే రోజా అరెస్ట్.
43) ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు కోసం , వైయస్ఆర్ జిల్లా , వైసిపి (ఎంపిటిసి) సభ్యురాలు లక్ష్మీదేవి ని కిడ్నాప్ చేసిన తెలుగుదేశం నేతలు.
44) పాయకారావు పేట నక్కపల్లిలో ఇద్దరు ఆడపిల్లలతో నివాసం ఉంటున్న పేర్ల అమ్మాజి అనే వితంతువు ఇంటిని పాతకక్షల నేపథ్యంలో పెట్రోల్ పోసి తగలపెట్టిన తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత అనుచరుడు మొసా సతీష్ (ఇది ఆమె వాదన)
45) గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉద్యందన గ్రామనికి చెందిన 13 ఏళ్ల మహేశ్వరి అనే పాపని తీసుకెళ్ళి లైంగిక దాడి చేసిన తెలుగుదేశం క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏవురి నాగేశ్వరరావు , ఉద్యందన సర్పంచ్ అయిన ఏవురి రామ కోటేశ్వరరావు తముళ్ళు , మేనళ్ళుల్లు రామకృష్ణ , నరేంద్ర, నరసింహారావు, వెంకటేశ్వరరావు.
46) వాట్సాప్ గ్రూపులలో అశ్లీల వీడియోలు పోస్టు చేసి మహిళా కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టిన నంద్యాల టీడీపీ మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్.
47) జాతీయ మహిళా దినొత్సవం రోజునే తుందుర్రులో ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత మహిళలను అరెస్టు చెసిన చంద్రబాబు ప్రభుత్వం.
48) రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు తనని కొట్టారని , టెక్కలి సిఐ, యస్ఐ తనను లైంగికంగా వేధించారని , అది చెప్పుకొవటానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకలేదు అని ఆర్అండ్ బి ఉద్యోగిని కూరపాని కళ్యాణి ఆంధ్ర సచివాలయం గేటు దగ్గర మత్తుమందు బిల్లలు మింగి ఆత్మహత్యా యత్నం చేశారు.
49) అనంతపురం పూలకుంటలో లక్ష్మి అనే మహిళ కుటుంభ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆంజనేయ స్వామి ఆలయం , దాని ఆదాయం 10 వేలు వడ్డి రూపంలో తీసుకున్న తెలుగు తమ్ముడు చెన్నప్ప, తిరిగి కట్టమంటే ప్రభుత్వం మాది మమ్మల్నే అడుగుతారా అని లక్ష్మి గారి మీద దాడి చేసిన చెన్నప్ప , ఆయన తమ్ముడు వెంకటేశులు.
50) నెల్లూరు జిల్లాలో ఇళ్ళలో పని చేసుకుంటు జీవనం సాగిస్తున్న ఓ గిరిజన మహిళ 12 ఏళ్ల కూతురిని బిస్కెట్ ప్యాకెట్ ఆశ చూపి తెలుగుదేశం నేత , జిల్లా వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు నరసింహరావు అత్యాచారం చేశాడు దీని పై ఆ కుటుంబం పోలీసులకి ఫిర్యాదు చేయగా మంత్రి నారాయణ రంగంలోకి దిగి పంచాయతి చేశారు…
51) విజయవాడలో కేన్సర్ పేషెంట్ అయిన 9వ తరగతి చదువుతున్న సాయి శ్రీ ఇంటిని కబ్జా చేసి ఆ పాపని , తల్లిని బయటకి గెంటివేసి ఆమె చావుకి కారణం అయిన తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమ అనుచరులు.
52) విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో లంబసింగి కి చెందిన ఇద్దరు గిరిజన బాలికలపై తెలుగుదేశం యంపిటిసి కొడుకు కొంతమందితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు – కేసు నమోదు చేయనీయకుండా చక్రం తిప్పిన యంపిటిసి
53) నంద్యాల ఉప ఎన్నిక సందర్భం గా నంద్యాల పట్టణం లోని వైయస్ఆర్ నగర్ కి చెందిన రేణుకమ్మ అనే వృద్దురాలు రేషన్ బియ్యం కోసం వెలితే నువ్వు ఓటు ఎవరికి ఏస్తావు అని అడిగిన డీలర్ , నేను జగన్ కి వేస్తాను అని చెప్పగానే ఆ వృద్దురాలికి రేషన్ ఇవ్వక పోగా దాడి చేసిన రేషన్ డీలర్.
54) ప్రేమ వ్యవహారంలో కన్న కూతురు జయదీపికను చంపిన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం టిడిపి పట్టణ అద్యక్షుడు నందుల రాజు.
55) విశాఖ జిల్లా అనకాపల్లి దగ్గర తెలుగుదేశం వారు వెంకటలక్ష్మీ మహాలక్ష్మీ అనే ఇద్దరు మహిళల నోటిలో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టివేసి మీ భూములు వదిలి వెళ్లకపోతే చంపుతాం అని బెదిరించారు. తమకు న్యాయం చేయాలి అని ఇద్దరు మహిళల అభ్యర్ధన.
56) సయ్యద్ సలీం అనే తెలుగుదేశం లీడర్ తనని వేధించాడని మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన హైదరాబాద్ కి చెందిన జహనాన్ తబాస్సుం అనే మహిళ.
57) నగ్న చిత్రాలు ఉన్నాయి బయటపెడతా అంటూ హైదరాబాద్ జూబ్లిహిల్స్ కి చెందిన ఒక మహిళను బ్లాక్ మెయిల్ చేసిన తెలుగుదేశం సీనియర్ నేత నామా నాగేశ్వరరావు , గతంలో కూడా కర్నాటక మాజీ మహిళా ఎమ్మెల్సీ ని వేధించినందుకు నామాపై కేసు.
58) మిస్ వైజాగ్ పొటీపై నిరసన తెలపటానికి వచ్చిన మహిళలపై విచక్షణా రహితంగా పోలీసుల చేత లాఠి చార్జ్ చేయించిన తెలుగుదేశ ప్రభుత్వం.
59) తమకి ప్రభుత్వం నుండి వచ్చిన హామీ ఎంతకీ నెరవేర్చకపోవటం ఎన్నిసార్లు సచివాలయంకి వెళ్ళినా చంద్రబాబు కలవక పోవడంతో మనస్తాపం చెంది , వెలగపూడి సచివాలయం ముందే పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసిన కర్నులు జిల్లా కోవెల కుంట్లకు చెందిన – షాకీరా , ఫాతీమా అనే అక్క చెల్లెల్లు.
60) అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం అప్పేచర్ల గ్రామంలో అంగన్వాడి కార్యకర్త హరిప్రియపై తెలుగుదేశం శాసన సభ్యులు జేసి సొదరుల వర్గం హత్యా యత్నం , దాడిలో హరిప్రియ చేయి నరికిన తెలుగుదేశం సభ్యులు.
61) విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జర్రిపోతుల పాలెంలో తెలుగుదేశం నేతలు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అనుచరులైన మడక అప్పలరాజు , సాలపు జోగా రావు ( యన్.టి.ఆర్ గృహ కల్ప ) పేరుతో దళిత భూములని కబ్జా చెయబోతే , దానిని అడ్డుకున్న దళిత మహిళ బట్టలు చింపి ఈడ్చి పాడేశారు. హైకోర్టు సైతం ఈ భూములు దళితులవని తీర్పు ఇచ్చినా తెలుగుదేశం నాయకులు మాత్రం దళితులపై దాడులు ఆపలేదు.
62. గతంలో ఇళ్ల పట్టాల కార్యక్రమంలో ప్రశ్నించిన ఒక మహిళలని పరిగెత్తించి జుట్టుపట్టుకు బాదిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి .
ఈ సంఘటనలపై భువనేశ్వరి ఎందుకు స్పందించలేదు. ఎందుకు తన భర్తతో చెప్పి బాధిత మహిళలకు అండగా నిలవలేదు. పైగా చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ ఉందని కల్లబొల్లి కబుర్లు చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?