ఏపీకి అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కీలక కాపునేత ముద్రగడ పద్మనాభం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతునట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో గట్టి పట్టు ఉన్న ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీలోకి వచ్చేలా చక్రం తిప్పిన ఆ పార్టీ కీలక నేతలు ఎట్టకేలకు సఫలీకృతం అయినట్టు తెలుస్తుంది.
ముద్రగడ గారు తొలుత జనసేన నేతలు వచ్చి తనని కలిసిన సంధర్భంలో తన సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే జనసేనలోకి వచ్చేందుకు సిద్దమని చెప్పుకున్నా పవన్ కళ్యాణ్ రెండు దఫాలు కలుస్తానని కబురు చేసి ఆ తరువాత ముద్రగడ గారికి మొహం చాటు వేయడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఆయన, చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తూ తన లాంటి వారితో ఇలా అవమానకరంగా ప్రవర్తించడం తగదని ఆయన ఆవేదన చెందినట్టు తెలుస్తుంది.
జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ తీరా తన దగ్గరికి వచ్చేసరికి ఇలా ప్రవర్తించడం సరిగా లేదని ముద్రగడ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే తన కుటుంభం నుండి పోటీ చేసే విషయంపై ఎటువంటి అవగాహనా ఒప్పందం లేకుండానే ముద్రగడ పద్మనాభం బేషరుతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సమాచారం.
1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలనుండి రాజకీయ ప్రయాణం కొనసాగించి ఎమ్మెల్యే గా మంత్రిగా పలు భాధ్యతలు చేపట్టారు. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన మళ్లీ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయలేదు. తర్వాత కాపునాడులో కీలక నేతగా వ్యవహరించి కాపుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశారు.