కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, తన కుమారుడు గిరితో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమలో వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ పీవీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే, కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
ఏపీ రాజకీయాల్లో ముద్రగడకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా సీనియర్ నేత. ఉభయగోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గానికి పెద్ద దిక్కు. ఈయన 1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మొత్తం నాలుగుసార్లు శాసనసభకు, ఒకసారి లోక్సభకు ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. కాపుల హక్కుల కోసం చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు.
2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడి పాలనలో ముద్రగడ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈయన గొంతు నొక్కేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. కుటుంబసభ్యులను అవమానించారు. అయినా భయపడకుండా పోరాటాలు చేశారు. నాడు పట్టించుకోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఆయన్ను తన పార్టీలోకి తీసుకోవాలని చూశాడు. కానీ ముద్రగడ స్పందించలేదు. బాబు ఎంతో ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. అలాంటి వ్యక్తి తాజాగా ఎలాంటి షరతుల్లేకుండా వైఎస్సార్సీపీలో చేరినట్లు ప్రకటించారు. ఇప్పటికే చాలా బలంగా ఉన్న పార్టీ పద్మనాభం రాకతో మరింత పటిష్టంగా తయారైంది. కాపులను చంద్రబాబు మోసం చేస్తే వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. వారి కోసం కార్పొరేషన్ను ఏర్పాటు చేయడమే కాకుండా భారీగా నిధులు విడుదల చేశారు. కాపు నేస్తం పథకం ద్వారా అండగా నిలిచారు.