రాష్ట్రంలో మరో నెలన్నర రోజుల్లో ఎన్నికలు రానున్న తరుణంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల కన్నా దూకుడుగా వ్యవహరిస్తుంది. మొదటి నుండి చెబుతున్న విధంగానే ఇప్పటికే తాము ఒంటరిగా బరిలోకి దిగితునట్టు ప్రకటించడమే కాకుండా 175 నియోజకవర్గాలకి సంభందించి మెజారిటీ అభ్యర్దులని ప్రకటించి రేస్ లో ముందు ఉంది. మరో పక్క తెలుగుదేశం జనసేన ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించుకున్నా ఇప్పటి వరకు అభ్యర్ధులు ప్రకటించడంలో పూర్తిగా విఫలం చెంది క్యాడర్ని , నాయకులని గందరగోళలోకి నెట్టేసింది. ఈ నేపధ్యంలో వైసీపీ ముందు ఈ పార్టీలు ఎన్నికల్లో నిలబడగలవా అనే ప్రశ్నలు సామాన్యుల నుండి వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల పరిస్థితి వారి పొత్తుల కలహాల వలన ఆశించిన విధంగా లేకపోగా ఎన్నికల్లో ఓటమికి ఇదే అతిపెద్ద కారణం అవ్వబోతుందా అనే అనుమానాలు ఇరు వర్గాల క్యాడర్లలో ఉన్న నేపధ్యంలో అధికార పార్టీ వైసీపీ మాత్రం వారి క్యాడర్ కి కావాల్సినంత జోష్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే చెప్పిన హామీలను 99% నెరవేర్చినట్టు లెక్కలతో సహా చెబుతూనే , రాష్ట్రంలో పోర్టులు , మెడికల్ కాలేజీలు, వచ్చిన భారీ ప్రాజెక్టులు , కంపెనీలు, పెట్టుబడులు చూపిస్తూ తమ పాలనలో జరిగిన అభివృద్దిని ప్రజలకి తెలిసేలా గడప గడపకీ తిరిగి చెప్పారు. దీంతో పాటు ఇప్పుడు సిద్దం సభలు పెడుతూ ఎన్నికల రణరంగానికి అన్నిపార్టీల కన్నా ముందే సమర శంఖం పూరించి క్యాడర్ లో జోష్ నింపారు.
భీమిలి, దెందులూరు, రాప్తాడు లో ఇప్పటికే జరిగిన మూడు సిద్దం సభలు భారీగా సక్సెస్ అవ్వడంతో ఇక నాలుగో సభని నిర్వహించేందుకు పల్నాడు ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు ప్రకటించారు. అయితే పల్నాడు ప్రాంతంలో అందరికి అందుబాటులో ఉండేలా చిలకలూరిపేటలో జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంగణంలో సభను నిర్వహించేందుకు సిద్దమైనట్టు తెలుస్తుంది. ఈ సభకి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, క్రిష్ణా నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి 54 నియోజకవర్గాల నుంచి కేడర్ హాజరు కానున్నారు. ఈ నేపధ్యంలో ఇదే సభలో జగన్ సంచలన ప్రకటన చేయబోతునట్టు ఊహాగానాలు ఇప్పుడు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చిన జగన్ రాబోయే ఎన్నికలకి సంభందించి రైతులకు, మహిళలకు ఇచ్చే హామీలపై ఇదే సభలో కీలక ప్రకటన చేయబోతునట్టు తెలుస్తుంది.
ఇదే జరిగితే ఇప్పటికే జోష్ లో ఉన్న క్యాడర్ కి మరింత బూస్ట్ ఇచ్చినట్టేనని, దీంతో రాబోయే ఎన్నికల సమరంలో జగన్ ని ఆపడం ఎవరి తరం కాదనే మాట వినిపిస్తుంది. ప్రచారం లో ఉన్నట్టు జగన్ ఈ హామీలకి సంభందించి ప్రకటన చేస్తారా లేదా అనేది మరి కొన్నిరోజుల్లోనే తేలిపోతుంది.