పెద్దిరెడ్డి మిథున్రెడ్డి.. రాజంపేట ఎంపీ, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్. ఇతని వ్యూహాల వల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ అభిమానులకు కంటి మీద కునుకు కురవైంది. పిఠాపురంలో ఎక్కడ ఓడిపోతానేని భయంతో సేనాని అక్కడక్కడే కాళ్లకు చక్రాల కట్టుకుని తిరగాల్సిన స్థితికి దిగజారిపోయాడు. నేను అత్యంత పాపులర్ హీరోనని చెప్పే వ్యక్తి గెలుపు కోసం ఇంటింటికీ తిరగాల్సి వస్తోంది.
మంత్రి రామచంద్రారెడ్డి తనయుడైన మిథున్ రెండోసారి ఎంపీగా పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీలో ట్రబుల్ షూటర్గా పేరుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చే బాధ్యతలను చక్కబెట్టడంలో దిట్ట. అభ్యర్థుల మార్పుల సమయంలో చాలామందికి సర్దిచెప్పేందుకు జగన్ మిథున్ను పంపారు. గోదావరి జిల్లాల్లో పార్టీ బలోపేతానికి అస్త్రాలను ఉపయోగిస్తున్నారు.
పవన్, ఆయన టీం ప్రస్తుతం మిథున్రెడ్డిపై పడి ఏడుస్తున్నారు. పిఠాపురంలో వంగా గీతను వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పెట్టింది. గతంలో గాజువాక, భీమవరంలో బరిలో దిగి దారుణ పరాజయాన్ని చవిచూసిన సేనాని ఈసారి పిఠాపురాన్ని ఎంచుకున్నారు. కానీ టీడీపీ ఇన్చార్జి వర్మ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో జనసైనికులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. మిథున్రెడ్డి వర్మకు డబ్బులిచ్చి ఆడిస్తున్నారని ఆరోపించారు. పవన్ను ఓడించేందుకు జగన్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నారని నోటికొచ్చింది చెప్పారు. కానీ చంద్రబాబు బుజ్జగింపులతో దిగొచ్చిన వర్మ జనసేనకు మద్దతు ఇచ్చారు. అయినా జనసైనికులు, సేన ముఖ్య నేతలు మిథున్ను అనడం ఆపలేదు. ఆయన ద్వారా డబ్బులు కుమ్మరిస్తున్నారని చెబుతూనే ఉన్నారు. రాయలసీమకు చెందిన వ్యక్తికి ఇక్కడేం పనని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అసలు హైదరాబాద్లో నివాసం ఉండే పవన్కు ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం ఏంటని కౌంటర్లు రాగానే.. మిథున్ను మరోవిధంగా లక్ష్యం చేస్తున్నారు.
వాస్తవానికి మిథున్రెడ్డి లోప్రొఫైల్లో ఉంటారు. నాయకుల మధ్య సమన్వయం కుదర్చడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే జగన్ ఎంతో కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల బాధ్యత అప్పగించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన తనయుడు వైఎస్సార్సీపీలో చేరడంలో మిథున్ కీలకపాత్ర పోషించారు. ఇంకా టీడీపీ, జనసేనల నుంచి జరుగుతున్న చేరికల్లో ఆయన ప్రమేయం ఉంది.
గోదావరి జిల్లాల్లో జనసేనపై రోజురోజుకు ప్రజల్లో నమ్మకం పోతోంది. పిఠాపురంలో గెలుపు కోసం పవన్ చెమటోడ్చాల్సిన పరిస్థితి వచ్చింది. రోజుల తరబడి అక్కడే తిరిగేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీనంతటికి మిథున్రెడ్డే కారణమని జనసైనికుల ఏడుపు. అసలు హైదరాబాద్లో ఉండే నాగబాబు అనకాపల్లి సీటు కోసం ప్రయత్నించాడు. ఆయనకేం సంబంధమని ఎవరూ అడగలేదే. రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తుంటాయి. అందులో భాగంగా మిథున్కు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేనకు ప్రత్యేకంగా వ్యూహాలంటూ ఉండవు. చంద్రబాబు నాయుడు పంపించే స్క్రిప్ట్ ప్రకారం నడుచుకోవడమే కదా..
ఇటీవల పవన్ ఓ మీటింగ్లో మాట్లాడారు. ‘సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యతను పెద్దిరెడ్డి తనయుడు మిథున్రెడ్డి తీసుకున్నాడంట. నేను గెలవకూడదని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చేసి ఓట్లు కొనేయాలని చూస్తున్నారు’ అని అడ్డదిడ్డంగా అబద్ధాలు చెప్పారు. వాస్తవానికి పవన్ను ఓడించాలంటే డబ్బేమీ అవసరం లేదు. ఆయన రెండు నాల్కల ధోరణిలో మాట్లాడిన వీడియోలను పిఠాపురం నియోజకవర్గంలో ప్రదర్శిస్తే చాలు. జనమే తరిమి కాడతారు. సభలు, సమావేశాల్లో కూడా సేనాని మిథున్రెడ్డి కోట్ చేసి అబద్ధాలు చెబుతున్నాడు. మిథున్ రాజకీయ వ్యూహాలకు అంత పెద్ద సినీ యాక్టర్ ఏ స్థాయిలో ఆందోళన చెందుతున్నాడో అందరికీ అర్థమైపోతోంది.