అన్ని రంగాలను కవర్ చేసుకుంటూ రావాలనే ఆరాటంలో భాగం గా రామోజీ ఇప్పుడు విద్యుత్ రంగంపై పడ్డాడు.. జగన్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ చార్జీలు పెరిగాయని, ట్రూ అప్ చార్జీలు వేశారని, ఓ తెగ రాసుకుంటూ వెళ్ళాడు… వాస్తవాల్లోకి వెళితే:
2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్లకుసీఎం బాబు మంజూరు చేసిన విద్యుత్ సబ్సిడీ 17,487 కోట్లు కాగా చెల్లించింది 10,923 కోట్లు చెల్లించని మిగతా 6,564 కోట్ల భారమే వినియోగ దారులపై ట్రూ అప్ ఛార్జెస్ గా పడింది…2019–20 నుంచి 2023–24 వరకూ నాలుగేళ్లలోనేసీఎం జగన్ మంజూరు చేసిన సబ్సిడీ 20,375 కోట్లు కాగా చెల్లించింది 20,479 కోట్లు.. సబ్సిడీ లు చెల్లించకపోతే విద్యుత్ పంపిణీ సంస్థలు ట్రూ అప్ చార్జెస్ వేసి వాటి నష్టాన్ని పూడ్చుకుంటాయి. జగన్ పూర్తిగా సబ్సిడీ చెల్లించినపుడు బాబు ఎందుకు చెల్లించలేకపోయాడు?
జగన్ ప్రభుత్వం నెలకు 500 యూనిట్లు వినియోగించే వినియోగదారులపై యూనిట్కు 90 పైసలు పెంచిందని ఈనాడు ఆరోపిస్తుంది… వాస్తవానికి ఏటా విద్యుత్తు చార్జీల టారిఫ్పై ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి పంపిణీ సంస్థలు సమర్పిస్తాయి. ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చేలా కొత్త టారిఫ్ ప్రకటిస్తుంది. ఈ 500 యూనిట్ ల పైన 90 పైసలు పెంచే నిర్ణయం 2019 ఏప్రిల్ 1 నుండే అమలులోకి వచ్చింది అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నెల రోజుల ముందే టారిఫ్ అమలులోకి వచ్చింది. మరి జగన్ ప్రభుత్వం పెంచింది ఎక్కడ?
నాలుగేళ్లుగా ఇదే చార్జీలు కొనసాగుతున్నాయి తప్ప జగన్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా పెంచింది ఏంలేదు. అంటే పెంచడం తప్పు అయితే ఆ తప్పు చేసింది బాబే కానీ జగన్ కాదు కదా? బాబు చేసిన తప్పును జగన్ పై ఎందుకు రుద్దుతున్నావ్ రామోజీ?గృహ, ఎల్టీ వాణిజ్య వినియోగదారులపై స్థిర చార్జీల భారం అని మరో ఆరోపణ…వాస్తవానికి గృహ వినియోగ కేటగిరీలో అంతకు ముందు విధిస్తున్న కనీస వినియోగ చార్జీలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. నిజానికి గృహ కేటగిరీలో సర్చార్జీలు ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. కర్ణాటకలో కిలోవాట్కు రూ.110 తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్కు రూ.110, త్రీ ఫేజ్కు రూ.385 వసూలు చేస్తున్నారు. కేరళలో సింగిల్ ఫేజ్కు రూ.40 నుంచి రూ.260 వరకూ, త్రీఫేజ్కు రూ.100 నుంచి రూ.200 వరకూ విధిస్తున్నారు.
శ్లాబుల్లో మార్పులు చేసి ఏటా రూ.1,400 కోట్లభారాన్ని 2022 ఏప్రిల్ నుంచి ప్రభుత్వం వేసింది. అని మరో ఆరోపణ…2022 ఏప్రిల్ నుంచి శ్లాబులు, యూనిట్ రేట్లను పెరుగుతున్న సరఫరా వ్యయానికి అనుగుణంగాపెంచింది.అదీగాక గృహ వినియోగ కేటగిరీ సరఫరా వ్యయం రూ.7.79 కాగా, బిల్లింగ్ రేటు రూ.5.13 మాత్రమే ఉంది. అంటే గృహ వినియోగదారులకు సరఫరావ్యయంతో పోలిస్తే తక్కువ ధరే వసూలు చేస్తోంది. అప్పుడు భారం ఎవరిపై పడినట్లు?
ఏటా విద్యుదుత్పత్తికి సంబంధించిన వ్యయం పెరుగుతుండడంతో వాటికి అనుగుణంగానే కొనుగోలు చార్జీలూ పెరుగుతున్నాయి. అంతే కానీ బాబు హయాంలో లా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి అని పలుమార్లు విద్యుత్ చార్జీలు పెంచలేదు… పెంచిన నామమాత్రపు భారం కూడా పేదలపై పడకూడదని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు (గతంలో 100 యూనిట్లుగా ఉండేది),బాగా వెనుకబడిన తరగతుల వినియోగదారులకు 100 యూనిట్ల వరకు,క్షౌరశాలలకు 150 యూనిట్ల వరకు, రజక వినియోగదారులకు 150 యూనిట్ల వరకు, చేనేత వృత్తి వినియోగదారులకు 100 యూనిట్ల వరకు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్తును ప్రభుత్వం రాయితీ ద్వారా అందిస్తోంది.
డిస్కంలు మరో రూ.7,200 కోట్లు ట్రూ–అప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరితే ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను ఏపీఈఆర్సీ పక్కన పెట్టిందని ఈనాడు అర్థంలేని ఆరోపణ చేసింది. మరి ఇదే పని 2019 ఎన్నికల ముందు బాబు ఎందుకు చేయలేదు? పైన చెప్పినట్టు జగన్ అధికారంలోకి రాకముందే చార్జీలు పెంచింది కదా ఏపీఈఆర్సీ? 7,200 కోట్ల భారం ప్రజలపై వేయడానికి అంగీకరించకపోవడం మంచి విషయమే కదా? ఒకపక్క పెంచకపోయినా పెంచినట్లు ప్రచారం చేస్తూ, మరో పక్క ఎన్నికలు వస్తున్నాయని పెంచడం లేదని ప్రచారం చేయడం ఏమిటో అది కూడా ఒకే వార్తలో రాయడం ఏమిటో రామోజీ కే తెలియాలి…
ఏదేమైనా విద్యుత్ విషయంలో రామోజీ ఎన్ని డ్రామాలు ఆడినా బాబు చేసిన ఘనకార్యాలు ప్రజలు గతంలో ప్రత్యక్షంగా అనుభవించి ఉన్నారు కాబట్టి, అది రామోజీ కి కూడా తెలుసు కాబట్టి బాబు చెండాలాన్ని కవర్ చేయలేక బొక్క బోర్లా పడుతున్నాడు..