సీఎం జగన్ గారి బస్సు యాత్ర మొదలయ్యాక జగన్ గారికి ప్రజల్లో వస్తున్నా ఆదరణ, స్పందన చూసిన తర్వాత పలు పార్టీల నుండి నాయకుల చేరికలు మరింత పెరిగాయి.సీఎం జగన్ గారి సంక్షేమ పాలన మళ్ళీ కొనసాగాలని కోరుకుంటూ వివిధ ప్రాంతాల టీడీపీ నేతలు పెద్ద ఎత్తున్న జగన్ గారికి మద్దతుగా వైసీపీ లోకి చేరుతున్నారు.
ఈ క్రమంలో నేడు కుప్పం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నేతలు వైసీపీ పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్ గారి సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ గారి సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ఎం.సుబ్రమణ్యంనాయుడు, కృష్ణమూర్తి, బేతప్పలు వైసీపీలో చేరారు. ఈ మేరకు వారికి సీఎం వైయస్ జగన్ వైయస్ఆర్ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు.
అదేవిధంగా గంగాధరనెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముఖ్యనేత. టీడీపీ సీనియర్ నేత, 2019 లో టీడీపీ తరపున గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు ఎ హరికృష్ణ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీలో భవిష్యత్ అనేది కనిపించడం లేదు ఈ గత 5 సంవత్సరాలలో జగనన్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయి, ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్న మళ్ళీ సీఎం కావాలి అందుకే వైసీపీ పార్టీలో చేరమని పార్టీ గెలుపు కోసం శాయశక్తులా పనిచేస్తామని ఆయా నేతలు తెలిపారు
బస్సు యాత్ర ముగిసే సమయానికి టీడీపీ లోని ముఖ్య నేతలు అంత వైసీపీలోకి చేరడం ఖాయం అనిపిస్తుంది, గ్రౌండ్ లో ఎక్కడా కూడా టీడీపీ మళ్ళీ గెలుస్తుందనే వేవ్ లేకపోవడం కూడా ఈ చేరికలు కారణంగా కూడా చెప్పవచ్చు . అదే విధంగా వివిధ జిల్లాలలో జిల్లా ఇంచార్జి ల సమక్షంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీ లో జాయిన్ అవుతున్నారు.