చంద్రబాబు తాను మాట్లాడితే విజనరీ అంటూ , తాను దేశవిదేశాలు తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నానంటూ ఎన్నెన్నో కధలు వినిపిస్తూ ఉంటారు. చంద్రబాబు చెబుతున్న మాటలకి అయనకి భజన చేసే ఎల్లో మీడియా ఎప్పుడు డప్పుకొడుతూనే ఉంటుంది.. ఎల్లో మీడీయాలో కొడుతున్న డప్పుని అందిపుచ్చుకునే తెలుగుతముళ్ళు వివిద ప్రసారా మధ్యమాల ద్వారా తిరిగి అదే డప్పుని వినిపిస్తూ ఉంటారు. ఇది ఈ రాష్ట్రంలో నిత్యం జరిగే తంతు.
అయితే చంద్రబాబు కొట్టే ఈ డప్పు వెనకాల పెద్ద మర్మమే దాగుంది. ఆయన విజనరీల పేరుతో రాష్ట్రానికి పరిచయం చేసే వ్యక్తులు చరిత్ర చూస్తే ఇది ఒక పెద్ద దొంగల ముఠా అని అర్ధమవుతుంది. దీనికి తాజా ఉదాహరణ సింగపూర్ ఈశ్వరన్. ఈ సింగపూర్ ఈశ్వరన్ కి చంద్రబాబుకి ఉన్న బంధం ఈ రాష్ట్ర ప్రజలకి కొత్తగా చెప్పవలసిన పనిలేదు, ఎందుకంటే రాజధాని మాటున 2016 నుండి ఈ రాష్ట్రంలో ఈ పేరు నిత్యం ఎల్లో మీడియాలో మోగుతూనే ఉంది.
2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. కొత్త రాజధాని కోసం కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీని కాదని. అమరావతిలోనే రాజధాని అని ప్రకటించారు. ఆ వెంటనే లాండ్ పూలింగ్ అంటూ రైతుల నుంచి భూమి సేకరించారు. ఆ తరువాత స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి సింగపూర్ సంస్థలను తెరమీదకు తెచ్చారు. అసెండాస్–సిన్బ్రిడ్జి–సెంబ్కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ నాడు సింగపూర్ వాణిజ్య – పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఇది సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందని చంద్రబాబు ప్రకటించారు, సింగపూర్ లోని ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి ప్రభుత్వానికి సంబంధం లేకున్నా ఈశ్వరన్ ని చూపుతు ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. దీని వెనుక రహస్యం భూములు దిగమింగే ఎత్తుగడే అని ప్రజలకి నాడే అర్ధమైంది.
అయితే ఇప్పుడు ఈ ఈశ్వరన్ భారీ అక్రమ లావాదేవీలు నడిపారన్న అభియోగాలతో సింగపూర్ లో అరెస్టైన నేపధ్యంలో సింగపూర్ పార్లమెంట్ ఆయన ఎంపీ సభ్యత్వంపై సస్పెన్షన్వేటు వేసింది. నేరారోపణలు నమోదు కావడం, ఆ వెంటనే నోటీసులు అందుకోవడంతో ఈశ్వరన్ రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. ఒక అవినీతి పరుడిని తీసుకుని వచ్చి గొప్ప వ్యక్తిగా ప్రచారం చేస్తూ యదేచ్చగా అమరావతిలో భారీ అవినీతికి పల్పడ్డారు చంద్రబాబు. ఇది ఒక్క ఈశ్వరన్ తోనే మొదలు కాదు చంద్రబాబు చరిత్రని నిసితంగా పరిసీలిస్తే ఇలా విదేశీ బాబులంటూ ఎందరో దొంగలని రాష్ట్రానికి పరిచయం చేసిన ఘనత చంద్రబాబుది.
ఇక రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టుతో సంచలనం రేపిన స్కిల్ స్కాం విషయంలోనూ ఇదే జరిగింది. సీమెన్స్ కంపెనీ ని చూపిస్తూ ఆ సీమెన్స్ కంపెనీకే తెలియకుండా సీమెన్స్ ఇండియా హెడ్గా వ్యవహరించిన సుమన్ బోస్ ని తెచ్చి కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచేశారు. ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సుమన్ బోస్ ని అరెస్ట్ కూడా చేసిన విషయం తెలిసిందే. సుమన్ బోస్ మా కంపెనీకి ఎప్పుడో రాజీనామా చేశారు. ఆయనకు మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ ప్రకటించింది కూడా.
అబ్దుల్ కలాం గారి ఆలోచనల్లోచి పుట్టుకోచ్చిన విజన్ 2020 ని ఈ రాష్ట్ర ప్రజలకి తానే కనిపెట్టానని చెబుతూ చంద్రబాబు చేసుకున్న ప్రచారం అందరికి గుర్తు ఉండే ఉంటుంది. అలాగే ఐఎస్బీ కూడా. ఈ రెంటిని కలిపే ఒక స్కాం కూడా ఉంది. ఐఎస్బీ రావడానికి చంద్రబాబు ఇంకా రజత్ గుప్తా అనే వ్యక్తి పనిచేశారు. ఈ రజత్ గుప్తా మకెన్సీ కంపెనీలో పనిచేసేవాడు. ఈ ఐఎస్బీ కి ఉచితంగా 250 ఎకరాలు కేటాయించి ఇక్కడికి వచ్చేలా డీల్ సెట్ చేసినందుకు రజత్ గుప్తా పనిచేస్తున్న మెకన్సీ కంపెనీకి విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసే కాంట్రాక్ట్ రూపంలో దానికి 1999 లోనే 2.5 కోట్లు ఆ కంపెనీకి కట్ట బెట్టాడు. ఆ డాక్యుమెంట్ తరువాత చెత్త బుట్టలోకి వెళ్ళింది. ఈ రజిత్ గుప్తా అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో 2ఏళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇంకా చెప్పుకుంటే ఈ ISB డీన్ గా వ్యవహరించిన రాం మోహన్ రావు అనే వ్యక్తి సత్యం కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా వ్యవహరించి స్కాం లో ఇరుక్కున్నాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఈశ్వరన్, ఒక సుమన్ బోస్ , ఒక రజిత్ గుప్త, ఒక బిల్లీరావ్, ఒక ఇజ్రాయిల్ టెక్నాలజీ స్కాం , లోకేష్ విదేశీ చదువులతో ముడిపడిన ఒక సంఖ్యా వాహిని స్కాం . వీళ్ళందరిని తెచ్చి విదేశీ ప్రతినిధుల మాటున చంద్రబాబు చేయని అవినీతి లేదు. ప్రజలని విదేశీ ముసుగులో ఏమార్చి కోటాను కోట్లు కొల్లగొట్టిన చరిత్ర వీళ్లది.