మొదటి నుండి వివాదాస్పద వైఖరి, అర్థం లేని వాదనలతో ఫేమస్ అయిన మహాసేన రాజేష్ లోకేష్ కంట పడటంతో తన దశ తిరిగిందని భావించాడు. లోకేష్ వాడే భాష, రాజేష్ వాడే భాష ఒకటే కావడంతో లోకేష్ పట్టుబట్టడంతో పి గన్నవరం సీటును రాజేశ్ కు కేటాయించింది టీడీపీ. ప్రకటన వెలుబడటమే తరువాయి, గతం లో తను తిట్టిన కాపులు, హిందూ వర్గాలు, అగ్రవర్ణాలు, ఆఖరికి టీడీపీ, జనసేన వారి నుండి కూడా ఊహించని రీతిలో వ్యతిరేకత వెల్లువెత్తింది.. ఈ నేపథ్యంలో తాను పి గన్నవరం పోటీ నుండి తప్పుకుంటున్నా అని, టీడీపీ మేలుకోసం ఎందాకైనా వెళ్తా అని బయటకు ప్రకటించినా లోలోపల మాత్రం తన టికెట్ పై భరోసాతో ఉన్నాడు. బాబు తనకు అన్యాయం చేయబోడని అత్యాశతో నియోజకవర్గంలో ప్రచారమూ ఆపలేదు…
గతం లో తను తిట్టిన హిందూ దేవుళ్ళ ని మొక్కుతూ, వినాయకుని గుడికి వెళ్లినా, కాపులను తిట్టినందుకు రంగా విగ్రహం ముద్దాడినా, అగ్రవర్ణాలను తిట్టినందుకు అందరం ఒకటే అని సానుభూతి పొందాలని చూసినా, ఆఖరికి అంబేద్కర్ రాజ్యాంగం కాలం చెల్లింది అన్నా, ఏ ఒక్క వర్గం అతనికి సపోర్ట్ చేయకపోగా అతను పోటీ చేస్తే దగ్గరుండి ఓడిస్తాం అని బహిరంగంగా ప్రకటించారు.. ఇక చేసేదేం లేక ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేద్దామని నిర్ణయించుకుని టీడీపీ మీద బెదిరింపులకు దిగినట్టు సమాచారం. ఇక తప్పక లోకేష్ ఆదేశాల మేరకు ప్రస్తుతం పి గన్నవరం నుండి పోటీ చేయబోయే టీడీపీ అభ్యర్థి అయిన గిడ్ది సత్యనారాయణ నుండి 3 కోట్ల రూపాయలు రాజేష్ కు ముట్టజెప్పినట్టు పట్టణం అంతా కోడై కూస్తుంది.. దానితో తనకు టికెట్ లేని విషయం జోన్-2 ఇంచార్జ్ అయిన సుజయ కృష్ణ రంగారావు సమాచారం ఇచ్చాడని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.. రాజకీయాల్లో ఇంత తక్కువ టైం లో కనీసం వార్డ్ మెంబర్ కూడా అవ్వకుండా ఈ స్థాయిలో డబ్బు వెనకేసిన వ్యక్తి బహుశా రాజేష్ ఒక్కడేనేమో.. ఎమ్మెల్యే ఎలాగూ అవ్వలేడు, కనీసం టికెట్ దక్కపోయినా అంత సొమ్ము ముట్టజెప్పడం తో రాజేష్ లోలోపల ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు..