కళ్ళార్పకుండా అబద్దాలు చెప్పడంలో దిట్ట అని చంద్రబాబుకి ఒక పేరు ఉంది. ఈ విషయంలో ఆయన్ని మించిన నాయకుడు దేశంలో మరొకరు లేరు, భవిష్యత్తులో కూడా ఆ రికార్డు చెరిపే వ్యక్తి ఉండకపోవచ్చు అని కూడా పలువురు విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఆ విశ్లేషణలు పటాపంచలు చేస్తున్నాడో గెలుపు ఎరగని యువనేత. ఎవరో కాదు బాబు తనయుడే. భావి నాయకుడిగా టీడీపీ పై రుద్దబడిన నారా లోకేష్ గత ఏడాది యువగలం పేరిట పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ యాత్రలో జగన్ ప్రభుత్వం పై పలు చిత్ర విచిత్ర ఆరోపణలు చేశారు లోకేష్.
వాటిలో ఒకటి బీసీల పై అక్రమ కేసులు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీల పై దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోయాయని, బీసీల పై అక్రమ కేసులు బనాయించి వారిని జైళ్ళకి పంపుతున్నారని, అలా రాష్ట్ర వ్యాప్తంగా 36000 మంది బీసీల పై అక్రమ కేసులు పెట్టారని టీడీపీకి అధికారమిస్తే బీసీల పై ఎవరూ అక్రమ కేసులు పెట్టకుండా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని 2023 మార్చ్ యువగళం యాత్రలో చెప్పుకొచ్చారు .
ఔరా నిజమా బీసీల పై వైసీపీ ప్రభుత్వం ఇన్ని అక్రమ కేసులు పెట్టిందా అని సమాజం నివ్వెరపోయి తేరుకొనే లోపే నాలుక మడత పెట్టేసాడు మన లోకేష్. మరుసటి నెల ఏప్రిల్ ల్ అదే యువగళం యాత్ర మరో సభలో మాట్లాడుతూ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వం 26000 మంది బీసీల పై అక్రమ కేసులు పెట్టిందని, తమకి అధికారమిస్తే బీసీ రక్షణ చట్టం తేవడమే కాకుండా బీసీల పై ఎవరైనా అక్రమ కేసులు పెడితే ఆ బీసీల కోర్టు ఖర్చులు కూడా తామే భరాయిస్తామని హామీ ఇచ్చారు లోకేష్.
మార్చి నెలలో బీసీల పై 36000 అక్రమ కేసులు పెట్టారని చెప్పిన లోకేష్, వెంటనే ఏప్రిల్ నెలలో 26000 అక్రమ కేసులు పెట్టారని చెప్పడంతో ఒక్క నెలలో పది వేల కేసులు ఎలా తగ్గాయో అర్ధం కాక తెల్ల మొహం వేశారు టీడీపీ శ్రేణులు.
సరే 26000 కేసులే నిజం అనుకొందామనుకొన్నా ఆ కేసులు జిల్లాల వారీగా ఎన్ని, ఎవరి పై నమోదు అయ్యాయి, కేసుల తాలుకు కంప్లైంట్ కాపీ, జీడీ ఎంట్రీ, ఎఫ్ఐఆర్ నెంబర్ లతో చర్చకి వస్తారా అన్న ప్రశ్నలకి లోకేష్ నుండి కానీ, ఇతర టీడీపీ నేతల నుండి కానీ సమాధానాలు ఉండవు .
ఇలా లేని కేసుల బూచి చూపుతూ వారి రక్షణ కోసం చట్టం తెస్తామని మాయ కబుర్లతో మేనిఫెస్టో రూపొందించి పైసా ఖర్చు లేని హామీ ఇచ్చి బీసీలని బుట్టలో వేద్దామనే తెలివి లోకేష్ దైతే కాదు, బహుశా తన హామీలు నమ్మట్లేదని చంద్రబాబు లోకేష్ చేత ఇలా చెప్పించి ఉండొచ్చని విశ్లేషకుల అభిప్రాయం.