జగన్ దెబ్బకు న్యూస్ ఛానెల్స్ లోనూ, సోషల్ మీడియా లో తప్ప గ్రౌండ్ లెవల్ లో తుడుచిపెట్టుకుపోయిన ప్రతిపక్షాలు, ఇప్పుడిప్పుడే తత్వం గ్రహించినట్లున్నాయి. అధికారం దక్కించుకోవడం కల్ల అని అర్థం అయినట్లు ఉంది, కనీసం తమ తమ స్థానాల్లో ఎమ్మెల్యే లు గా అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బిక్కుబిక్కుమంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
కుప్పం లో చంద్రబాబు కు 2004 నుండి వరసగా మెజారిటీ తగ్గుతూ వస్తుంది. 2019 ఎన్నికల్లో కేవలం ముప్పై వేల ఓట్ల తో గెలిచి పరువు దక్కించుకున్నాడు. కానీ ఈసారి అదేమంత సులువు కాదు. ఎన్నికల సంఘం తమిళనాడు దొంగ ఓట్లను ఎత్తెయ్యడం, జగన్ కుప్పం ను మున్సిపాలిటీ చేయడం, స్థానిక ఎన్నికల్లో స్వీప్ చేయడం, సాక్ష్యాత్ బాబు చదువుకున్న స్కూల్ ను 35 ఏళ్లుగా ఎమ్మెల్యే గా, 14 ఏళ్లు సీఎం గా ఉండి కూడా బాగు చేయని పాఠశాలను నాడు-నేడు కింద బాగు చేయడం, శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి కుప్పం కు నీరు అందించడం వంటి తదితర అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలతో కుప్పం వాసుల ఆలోచన శైలి మారిందని, ఈసారి బాబు ఓటమి తథ్యం అని సూచన ప్రాయంగా తెలియడంతో, ముందు సీటు మార్చుకోవాలని ఆలోచించినా, రాష్ట్రవ్యాప్తంగా పరువు పోతుంది అనే భయంతో తప్పనిసరై కుప్పంలోనే పోటీ చేయబోతున్నాడు. కాగా ఎన్నడూ లేనిది ఇంటింటి ప్రచారం చేయడం, గతంలో సొంత ఇల్లే లేని కుప్పం లో సొంత ఇల్లు కట్టుకుంటా అని శంకుస్థాపన చేయడం తదితర కార్యక్రమాలన్నీ ఓటమి భయంతోనే, కనీసం ఎమ్మెల్యే గా అయినా గెలవాలన్న ఆశతోనే అనేది విశ్లేషకుల భావన.
ఇక 2019 లో పోటీ చేసి ఓడిపోయి, తానో జాతీయ నేతనని, సీఎం అవ్వడానికి తనకు అన్ని అర్హతలున్నాయి అని భావించే పవన్ ఈసారి ఎలాగైనా అసెంబ్లీ లోకి అడుగుపెట్టాలని పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా తిరగాల్సిన పవన్ జాతీయ నేత స్థాయి నుండి కేవలం పిఠాపురం కే పరిమిత అయ్యాడు. పిఠాపురం లో మినహా మరే చోట ప్రచారం నిర్వహించే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో టీడీపీ బలంగా లేని ప్రతీ చోటా తిరిగిన పవన్ ఈసారి కేవలం జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో ఓ పదో, పన్నెండో నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. అది కూడా గ్యారెంటీ లేదు. ఇక తన ప్రచారం మొత్తం పిఠాపురంకే పరిమితమవ్వడం తథ్యం. జాతీయ నాయకుడు చివరికి పిఠాపురం నాయకుడు అయ్యాడు.
ఇకపోతే లోకేష్. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి, తన కామెడీ టైమింగ్ తో రాష్ట్ర ప్రజలకు ఎండాకాలం లో ఎంటర్టైన్మెంట్ అందించిన లోకేష్, ఈ ఎన్నికల్లో తన మార్కు కామెడీ కి కాస్త దూరం అయ్యాడు. లోకేష్ వల్ల టీడీపీ కి నష్టమే తప్ప లాభం లేదని సీనియర్ల వాదనతో బాబు ఏకీభవించినట్లుగా తెలుస్తుంది. అందుకే గత ఎన్నికల్లో ఓడిపోయిన మంగళగిరి నుండే మళ్లీ పోటీ చేస్తూ ఆ నియోజకవర్గం లో గెలుపు కోసం లోకేష్ చేయని ప్రయత్నం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన లోకేష్ చివరికి మంగళగిరికే పరిమితం అయ్యాడు. పార్టీ అధికారంలోకి రావడం తర్వాత కనీసం ఈసారైనా ఎమ్మెల్యే గా గెలిచి పరువు దక్కించుకోవాలని ఆరాటపడ్టున్నట్లు ఉన్నాడు లోకేష్.
ఇక పోతే టీడీపీ కి సినిమా గ్లామర్ బాలకృష్ణ, 2014 ఎన్నికల సమయానికి లెజెండ్ అనే సినిమా తీసి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసిన ఆయన, టీడీపీ బహిరంగ సభలు పెట్టినప్పుడు మోదీ మీద విరుచుకుపడ్డ ఆయన ఈసారి హిందూపూర్ లో వైసీపీ మహిళా అభ్యర్థిపై ఓటమి పాలవుతున్నాడని సర్వే లు చెప్పడంతో తన బలగాన్ని అంతా హిందూపూర్ లో దింపి గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇలా కూటమి ప్రచారం సప్పగా సాగుతూ ఎన్నినాళ్లు ఇలా కంటిన్యూ అవుతుందో తెలియదు కానీ, ఎన్నికలకు ముందే వారు కాడి వదిలెయ్యడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..