1978 నుండి వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తున్న పులివెందుల కోసం ఆ కుటుంబం అండగా నిలబడింది, అధికారంతో సంబంధం లేకుండా, ప్రభుత్వం తో పని లేకుండా సొంత నిధులతో అభివృద్ధి పనులు చేశారు…
వైయస్సార్ 2007 లో తనకు విద్య నేర్పిన గురువు వెంకటప్పయ్య గారి పేరుపై 12 ఎకరాల సువిశాల ప్రాంగణం లో శ్రీ వెంకటప్పయ్య మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ని పెట్టి, 2500 మంది విద్యార్ధులకు సరిపడేలా సదుపాయాలతో, ఎల్కేజీ నుండి పదో తరగతి వరకు ఉచితంగా చదువు చెప్పాడటంతో పాటు, ఉచితంగా పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ లు, యూనిఫామ్ లు ఇస్తూ ప్రపంచస్థాయి విద్యను అందిస్తున్నారు.. ఇప్పటికీ వైయస్ భారతి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా పని చేస్తూ వేలమందికి ఉచిత విద్యను అందిస్తున్నారు…
ఇలా స్కూల్స్ కి కాలేజీలకి సొంత భూములు ఇచ్చి ఆదరించిన కుటుంబం వైయస్ కుటుంబం.. అందుకే పులివెందుల గడ్డ వైఎస్ అడ్డా అయ్యింది..
మరో పక్క 1983 లో చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పానికి షిఫ్ట్ అయిన బాబు అప్పటి నుండి ఇంతవరకు కుప్పం లో ఎవరికీ ఒక సెంటు భూమి పంచింది లేకపోగా, సొంత పెద్దమ్మ నారా సిద్ధమ్మ భూమిని కూడా ఆక్రమించాడు.. తన సొంత నియోజకవర్గం ప్రజలకోసం కనీసం ఏనాడూ ఎండాకాలంలో చలివేంద్రం పెట్టిన పాపాన కూడా పోలేదు…
అలాంటి బాబు వైసీపీ వారు వైనాట్ కుప్పం అంటుంటే, వై నాట్ పులివెందుల అనడం అత్యంత హాస్యాస్పదం. కుప్పానికి జగన్ ప్రభుత్వం చేసిన మేలుకి వైనాట్ కుప్పం అనడంలో అర్థం ఉంది కానీ, సొంత ఊరికే ఎం చేయని బాబు వైనాట్ పులివెందుల అనడం పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందాన ఉంది…