ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ సంస్థలు
Kakinada : జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న సరళమైన విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ సంస్థలు సిద్ధమవుతున్నాయి. తాజాగా కాకినాడలో(Kakinada) కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థ పాస్ఫరిక్ యాసిడ్, సల్య్ఫూరిక్ యాసిడ్ తయారీ ప్లాంట్లను నెలకొల్పేందుకు రూ.1,029 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాబోయే రెండేళ్ళలో ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్టు వెల్లడించింది. కోరమాండల్ పెట్టుబడుల ద్వారా చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది.
స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన తీర్మానాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం తెలిపినట్లైంది. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు దక్కన్నాయి. పరిశ్రమల ఏర్పాటులో సరళతరమైన విధానాలను అవలంబిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోర్టుల నిర్మాణం పూర్తైతే రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు రానున్నాయి.