ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ భీమిలీ సీటు విషయమై కూటమిలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతీ శ్రీనివాస్ కి జగన్ అవకాశం కలిపిస్తే తెలుగుదేశం జనసేన కూటమి మాత్రం ఆసీటు నాదంటే నాదని ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళారు. తొలుత ఆ సీటుని తెలుగుదేశం కోరాడ రాజాబాబుకి ఇస్తునట్టు లీకులు వదలగా జనసేన క్యాడర్ మాత్రం పంచకర్ల సందీప్ కే భీమిలీ సీటు వస్తుందని ప్రచారం చేశారు. అయితే తెలుగుదేశం నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ భీమిలి సీటు తనకే దక్కాలని పట్టుపట్టి కూర్చోవడంతో చంద్రబాబు గంటా వత్తిడికి తలొగ్గి ఆయనకే సీటు కేటాయించారు.
భీమిలీ సీటు గంటా శ్రీనివాస్ కి ఇస్తునట్టు తెలుగుదేశం ప్రకటించగానే జనసేన క్యాడర్ భగ్గుమంది. పంచకర్ల సందీప్ దగ్గరికి వెళ్లి ఇన్నిరోజులు తాము పడిన కష్టానికి విలువ లేకుండా పోయిందని వాపోయారు. గంటాకి సీటు ఇవ్వడంతో నియోజకవర్గంలో తమ రాజకీయ భవిష్యత్తుపై గ్యారెంటీ ఏముంది అంటూ తీవ్రoగా స్పందించారు. ఇలాంటీ రాజకీయాలకి తాము మద్దతు ఇవ్వమంటూ సందీప్ ముందే తెగేసి చెప్పారు.
గంటా శ్రీనివాస్ కి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీటు ప్రకటించడంతో జనసేనతో పాటు ఇటూ టీడీపీలోనూ అసంతృప్తి జ్వాలలు రేగాయి. భీమిలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డబ్బున్న వారికే చంద్రబాబు టికెట్ల ఇస్తున్నారని టీడీపీలో సీట్లకు వేలంపాట జరుగుతుందని. భీమిలీ సీటు తనకే ఇస్తాని హామీ ఇచ్చి పని చేసుకోమని చెప్పి ఇప్పుడు అనేక భూ అక్రమాలకు పాల్పడటంతోపాటు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర ఉన్న గంటా శ్రీనివాస్ కి ఎలా ఇస్తారని ఘాటుగానే ప్రశ్నించారు. దీంతో భీమిలీ సీటు వ్యవహారంలో మొదలైన రగడ మరో మలుపు తిరిగినట్టైంది.