తిరువూరు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుకు ప్రజల నుంచి నిరసన ఎదురైంది. ఆయన నియోజకవర్గంలో రోడ్ చేస్తూ ఓ చోట ఆపారు. ఈ సమయంలో ప్రజలు ఆయన్ను పట్టించుకోలేదు. ముఖ్యంగా మహిళలు ‘తెలుగుదేశం పోవాలి. మా ఓటు ఫ్యాన్ గుర్తుకే’ అని తెగేసి చెప్పారు. దీంతో అవాక్కయిన కొలకపూడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు ఒప్పుకోకపోవడంతో ప్రచార వాహన డ్రైవర్ను పద పద అంటూ పలాయనం చిత్తగించారు.
శ్రీనివాసరావు మొదటి నుంచి వివాదస్పమైన వ్యక్తి. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడి పాలనను తిట్టిన ఆయన ఆ తర్వాత ఆ బాబు పంచనే చేరారు. అమరావతి ఉద్యమం పేరుతో హంగామా చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులను ఇష్టానుసారంగా మాట్లాడారు. ఎల్లో మీడియా డిబేట్లలో రెచ్చిపోయారు. ఈయన భక్తికి మెచ్చిన నారా వారు తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జిగా శావల దేవదత్కు ద్రోహం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. టీడీపీ కండువా కప్పుకొని గ్రామాలకు వెళ్తున్న కొలికపూడికి అటు తెలుగు తమ్ముళ్లు, ఇటు ప్రజలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు.
దేవదత్ వర్గం శ్రీనివాసరావుకు సహకరించడం లేదు. నియోజకవర్గంపై పట్టు లేకపోవడంతో కొందరు చోటా నాయకుల్ని నమ్ముకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సీఎం జగన్ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన మహిళలు తాజాగా కొలికపూడి ఆశలపై నీళ్లు చల్లారు. రోడ్షోలో పరువు పోవడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. ముందుగానే జనానికి చెప్పి ఏమీ మాట్లాడకుండా చూసుకోవాలి కదా.. ఇప్పుడు ఆ వీడియో వైరలవుతుందంటూ తన వారిపై కోప్పడినట్లు తెలిసింది. ఎన్నికల్లో నిలబడి గెలుపొందడమంటే పచ్చ డిబేట్లలో చేరి అధికార పార్టీని తిట్టినంత ఈజీ అనుకున్నాడు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఈ మేధావి ముసుగులోని వ్యక్తికి అర్థమవుతున్నాయి.