పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడి చెరువు మండల కేంద్రంలో టీడీపీ నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో జగన్ బీసీల పాలిట నయవంచకుడని.. టీడీపీ అంటనే బీసీల పార్టీ అని, జగన్ బీసీలను నయవంచనకు గురి చేశాడని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోపణలు చేశాడు. బీసీలకు పెద్దపీట వేసిందే టీడీపీనే అని త్వరలోనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని అన్నారు.
వైఎస్ జగన్ అధికారంలోకి రాక ముందు టీడీపీ బీసీల రక్షణ కోసం ఎందుకు చట్టం చెయ్యలేదో ఆలోచించి మాట్లాడితే బాగుండేది. ఒకప్పుడు బీసీలకు ఏమీ చెయ్యని టీడీపీ నేతలు.. ఎన్నికలు దగ్గరపడేసరికి సవితి తల్లి ప్రేమను వలకపోస్తున్నాయి. అసలు టీడీపీ హయాంలో కంటే వైసీపీ హయాంలోనే బీసీ కులాలకు ఎక్కువ న్యాయం జరిగింది.
నిజానికి రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాధికారంలో స్థానం కల్పించారు. ప్రస్తుతం వైసీపీ పార్టీ లో బీసీల నుండి నలుగురు రాజ్యసభ సభ్యులుగా, అత్యధికమంది బీసీలు మంత్రులుగా, ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి రాజ్యసభ వరకు 50 శాతం నామినేటెడ్ పదవులను బీసీలకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిది. 139 కులాలు ఉన్న బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సీఎం వైఎస్ జగన్ బీసీలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. అంతేకాకుండా టీడీపీ హయం లో అరకొరగా ఉండే సంక్షేమ పథకాలు బీసీలకు ఎంతమందికి అందాయో అంతకంటే రెండింతల మందికి పదుల సంఖ్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం లో అందుతున్నాయి.
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ అని నిత్యం చెప్పే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆర్ధికంగా సామాజికంగా బీసీలను బలపరిచేవిధంగానే పరిపాలన సాగిస్తున్నారు కాబట్టే వైఎస్సార్ సీపీ అంటేనే బీసీల పార్టీ అని బీసీలంతా నమ్ముతున్నారు.