శ్రీకాకుళం జిల్లా టీడీపీలో కింజరాపు కుటుంబం బాబాయ్ అబ్బాయ్ దెబ్బకు వణికపోతున్నది. తమ మాట వినని నాయకులకు టికెట్ రాకుండ చేసి జిల్లాలో తమకు అడ్డులేకుండా చేసుకుంది. తాజాగా శ్రీకాకుళం నియోజకవర్గనాకి పాత సినియార్ టీడీపీ నాయకులు అయిన గుండ అప్పల సూర్యనారాయణ , లక్ష్మిదేవి దంపతులకు కాదని గొండు శంకర్ కు టికెట్ కేటాయించారు. దీని వెనుక కింజరాపు కుటుంబం చక్రం తిప్పింది. మొదటి నుండి గుండ అప్పల సూర్యనారాయణ కింజరాపు కుటుంబనికి లొంగకుండా నియోజకవర్గంలో తనకంటూ సొంత ఇమేజ్ ను ఏర్పాటు చేసుకొని చేసుకున్నారు.
అయితే తమకు అనుకూలంగా లేకుండ సొంతంగా పనిచేసుకుంటున్నాడని కక్ష గట్టిన కింజరాపు ఫ్యామిలీ కి చెందిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కలిసి కోట్లాధిపతి అయిన గొండు శంకర్ ను ప్రోత్యహించి శ్రీకాకుళంలో పార్టీ కార్యక్రమాలు చేసేలా చేసి హడావిడి చేయించి చంద్రబాబు దగ్గర గొండు శంకర్ కు మాత్రమే ప్రజా బలం వుంది అని నమ్మించి గొండు శంకర్ దగ్గరా డబ్బులు తీసుకోని గుండ అప్పల సూర్యనారాయణను తొక్కేసారు.
శ్రీకాకుళం టికెట్ కోసం చంద్రబాబుకు , లోకేష్ కు చెరో 10 కోట్లు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కి , కున రవికి కోట్లలో సమర్పించుకున్నానని గొండు శంకర్ వాపోతున్నారు. ఇక టికెట్ కేటాయింపులు జరిగిన తరువాత ప్రెస్ మీట్ పెట్టి అచ్చెన్నాయుడుకి మేమంటే ఎందుకంత కక్ష అంటూ గొండు శంకర్ కన్నీళ్ళ పర్యంతమయ్యారు.
పాతపట్నంలో ఇప్పటికీ అరు సార్లు గెలిచిన కలమట కుటుంబానికి కూడా కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కలిసి టికెట్ రాకుండ చేశారని కలమట వెంకటరమణ ఆరోపణలు చేస్తున్నారు. డబ్బులు, భూములు కింజరాపు ఫ్యామిలీ తీసుకొని మామిడి గోవిందరావు కి టికెట్ వచ్చేలా చేశారు. మా తూర్పు కాపుల దెబ్బ టీడీపీకి జిల్లా మొత్తం చూపిస్తా అని కలమట వెంకటరమణ భాదతో రగిలిపోతున్నారు.
జిల్లాలో మరో సీనియర్ నాయకుడు అయిన కళా వెంకట్రావును తమకు అడ్డులేకుండా చేసుకోవాలి అని బిజెపితో కుమ్మక్కయ్యి ఎచెర్ల టికెట్ పొత్తులో భాగంగా బిజెపి పోటి చేసేలా చేశారు. దీనితో కళా వెంకట్రావు తప్పని పరిస్థితుల్లో చీపురుపల్లి నియోజకవర్గంకు తరలిపోయారు. దీనితో శ్రీకాకుళం జిల్లాలో తమకు అడ్డులేకుండా చేసుకుంటున్నారు కింజరాపు ఫ్యామిలీ. ఈ బాబాయ్ అబ్బాయ్ దెబ్బకు జిల్లాలో అందరు నాయకులు గజగజ లాడుతున్నారు. ఈ లొల్లితో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఓటమి చెందే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.