టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులని ప్రకటించిన నేపథ్యంలో నిన్న విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేఏ పాల్ మాట్లడుతూ టీడీపీ జనసేన పొత్తుకు కాపులు వ్యతిరేకం అని తెలిపారు. వంగవీటి రంగాను హత్య చేయించిన చంద్రబాబుతో జత కట్టడం ఏంటి అని ప్రశ్నించారు. కాపులని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఎవరు అని దుయ్యబట్టాడు . డిసెంబర్ 25నే తాను జనసేనకు 24 సీట్లు టీడీపీ పార్టీ ఇస్తుంది అని తెలిపాను అన్నారు.
చంద్రబాబు ఇచ్చే ప్యాకేజి ఏంటో చెప్తే అది తానే ఇస్తా అని ,జనసేనను ప్రజాశాంతి పార్టీలో విలీనం చేస్తే పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తా అని తెలిపాడు. 2014లో టీడీపీ బీజేపీ జనసేన కూటమికి తనది హామీ అని చెప్పిన పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ తిరుపతి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారని, ప్రత్యేక ప్యాకేజీ, స్మార్ట్ సిటీలు నిర్మాణం చేపడతానని చెప్పి మోసం చేసిన వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు అని అడిగారు. వైఎస్సార్ సీపీ సిద్ధం అంటుంది.టీడీపీ, జనసేన దోచుకోవడానికి సంసిద్ధం అంటున్నాయని ఎద్దేవా చేసారు. మోదీ తొత్తులుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.